సాధారణంగా తెలుగు సినీ పరిశ్రమలో ఎక్కువగా హీరోల డామినేషన్ ఉంటుంది. ఒక్క తెలుగు అనే కాదు ఏ సిని పరిశ్రమలో చూసినా సరే ఇదే విధంగా ఉంటుంది. హీరోని దాటి హీరోయిన్ ని హైలెట్ చేయడానికి దర్శకులు కూడా ఒప్పుకోరు. ఎందుకంటే హీరోలకు స్టార్ ఇమేజ్ ఉంటుంది గాని హీరోయిన్లకు చాలా వరకు తక్కువగా ఉంటుంది. అందుకే హీరోని హైలెట్ చేస్తారు. అందుకే సినిమాలకు వసూళ్ళు కూడా ఎక్కువగా వస్తు ఉంటాయి. అయితే ఇటీవలి కాలంలో మాత్రం మనం ఒక హీరోయిన్ డామినేషన్ ఎక్కువగా చూస్తూ వస్తున్నాం. 

 

హీరోయిన్ ఏ సాయి పల్లవి. వరుస సినిమాలు చేయకపోయినా, అప్పుడప్పుడు సినిమాలు చేసినా సరే సినిమాలలో ఆమె డామినేషన్ చాలా వరకు ఉంటుంది. ఫిదా సినిమాలో సాయి పల్లవి ని చూసిన వాళ్ళు షాక్ అయిపోయారు. వరుణ్ తేజ్ ని ఆమె డామినేట్ చేసింది. ఆ సినిమాలో వరుణ్ కంటే కూడా ఆమె నటనే బాగుంది అని రివ్యూలు కూడా రాసారు. ఏంది బే, భానుమతి సింగల్ పీస్, బొక్కలు ఇరగ్గోడతా అంటూ ఆమె మాట్లాడిన మాటలు ఫాన్స్ ని నిజంగానే ఫిదా చేసాయి. అయితే మరి ఏమైందో ఏమో ఆ తర్వాత సినిమాల్లో కనపడలేదు. 

 

ఇక ఆ తర్వాత పడి పడి లేచే మనసు సినిమాలో సాయి పల్లవి ఏంటి లైన్ వేస్తున్నావా అంటూ శర్వానంద్ ని కడిగి పారేసింది. ఆ సీన్స్ కూడా బాగా హైలెట్ అయ్యాయి. ఇక నానీ హీరోగా వచ్చిన ఎంసిఏ సినిమాలో కూడా ఇదే స్థాయిలో ఈ అమ్మాయి నానీని డామినేట్ చేసింది. పెళ్లి చేసుకుందాం...? ఎప్పుడు చేసుకుందాం...? అంటూ ఆమె మాట్లాడిన మాటలకు అభిమానులు పడిపోయారు. ఇక ఆ సినిమాలో సాయి పల్లవి డాన్స్ హైలెట్. ఇక ఇప్పుడు చైతు తో లవ్ స్టోరీ సినిమాలో నటిస్తుంది. తాజాగా వచ్చిన ట్రైలర్ లో చైతుకి ట్రైన్ లో కిస్ చేసేసింది. టీజర్స్, ట్రైలర్ లో సాయి పల్లవి డామినేషన్ ఉండటం కూడా సినిమాలకు కలిసి వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: