టాలీవుడ్ బాహుబలి ప్రభాస్ వరుస సినిమాలకు రెడీ అవుతున్నాడు. బాహుబలి సినిమా జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్న ప్రభాస్, సాహోతో పాన్ ఇండియా స్టార్గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. అయితే సాహో కమర్సియల్ గా వర్క్ అవుట్ అయినా చిత్రయూనిట్ అనుకున్న స్థాయి విజయం మాత్రం సాధించలేదు. దీంతో తదుపరి చిత్రం విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు ప్రభాస్. ప్రస్తుతం జిల్ ఫేం krishna KUMAR' target='_blank' title='రాధా కృష్ణ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>రాధా కృష్ణ దర్శకత్వంలో పీరియాడిక్ రొమాంటిక్ డ్రామాలో నటిస్తున్నాడు ప్రభాస్.
ఈ సినిమాను యూవీ క్రియేషన్స్తో కలిసి ప్రభాస్ పెదనాన కృష్ణం రాజు గోపీ కృష్ణ మూవీస్ బ్యానర్పై రూపొందిస్తున్నాడు. ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు జాన్ అనే టైటిల్ ను పరిశీలించారు. అయితే ఆ టైటిల్ 96 రీమేక్కు వాడేయటంతో ఇప్పడు ఓ డియర్ లేదా రాధే శ్యామ్ అనే పేర్లను పరిశీలిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాదిలో రిలీజ్ అవుతుందన్న టాక్ వినిపిస్తోంది.
అయితే ఈ సినిమా తరువాత సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఆ ప్రాజెక్ట్ మీద ఎలాంటి అధికారిక ప్రకటనా రాకముందే తాజాగా ఈ లిస్ట్లోకి మరో దర్శకుడు ఎంట్రీ ఇచ్చాడు. ఎవడే సుబ్రమణ్యం సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన నాగ అశ్విన్ తరువాత మహానటి సినిమాతో జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్నాడు. ఈ యువ దర్శకుడు ప్రస్తుతం ఓ భారీ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తరువాత ప్రభాస్ హీరోగా ఓ సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడట నాగ అశ్విన్. ప్రస్తుతానికి ఎలాంటి అధికారిక ప్రకటనా లేకపోయినా ప్రభాస్, నాగ అశ్విన్ల కాంబినేషన్ క్రేజీ అంటున్నారు ఫ్యాన్స్.