తెలుగు ఇండస్ట్రీలో పరుచూరి బ్రదర్స్ అంటే ఎంత గొప్ప పేరు ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరు కేవలం కథా రచయితలు మాత్రమే కాదు.. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. ఒకప్పుడు ఎన్టీ రామారావు, నాగేశ్వరావు,శోభన్ బాబు, కృష్ణ లాంటిస్టార్ హీరోలకు మంచి హిట్స్ అందించారు. అలాంటి స్టార్ రైటర్స్ అయిన పరుచూరి బ్రదర్స్ తో గొడవ పడ్డారట.. ఫ్యాక్షన్ చిత్రాల కేరాఫ్ అడ్రస్ అయిన డైరెక్టర్ బి. గోపాల్. తెలుగు తెరపై యాక్షన్ కథలను పరిగెత్తించిన దర్శకుల జాబితాలో బి.గోపాల్ పేరు ముందువరుసలో కనిపిస్తుంది. ఫ్యాక్షన్ చిత్రాలు తీయాలంటే బి గోపాల్ తర్వతనే అన్న పేరు తెచ్చుకున్నారు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో దర్శకులు బి గోపాల్ మాట్లాడుతూ.. నేను ఒంగోలు కాలేజ్ లో చదువుకునే రోజుల్లోనే నాటకాల పిచ్చి ఎక్కువగా ఉండేది. అందువలన చదువు ఎక్కడం లేదనే విషయం నాకు అర్థమై పోయింది. ఆ తర్వాత నా దృష్టి సినీ ఇండస్ట్రీపై పడింది. ఈ విషయం మా నాన్నతోచెప్పి ఒప్పించి చెన్నై పయణం అయ్యాను. దర్శకుడు పీసీ రెడ్డిగారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరి ఎన్నో మెలుకువలు నేర్చుకున్నాను. అప్పట్లో నెలకు వంద రూపాయలు ఇచ్చేవారు.కొన్ని సార్లు ఆ పనికూడా ఉండేది కాదు. తర్వాత నా అదృష్టం కలిసివచ్చి రాఘవేంద్రరావు వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరాను. ఇక ఇండస్ట్రీలో పరుచూరి బ్రదర్స్ తో తనకు ఎంత అనుబంధం ఉందని అన్నారు.
అయితే ఒక సందర్బంలో వారితో పెద్ద గొడవనే పెట్టుకున్నానని అన్నారు. 'ప్రతిధ్వని' కథ విషయంలోనే ఎక్కడో తప్పు జరుగుతోందని కరెక్టుగా ఉండాలి అని పట్టుబట్టాను. ఆ విషయంలో వారి మద్యకూడా చిన్నఇబ్బంది తలెత్తినట్టు తెలిసింది. అయితే ఇండస్ట్రీలో వారికి గొప్ప పేరు ఉంది. వాళ్లతో గొడవ పెట్టుకుంటే కెరియర్ ప్రోబ్లమ్ లో పడుతుందని కూడా నేను ఆలోచించలేదు. నా గురించి తెలుసుకొని వారు కూడా అర్థం చేసుకున్నారు. ఆనాటి నుంచి ఈనాటి వరకూ మా అనుబంధం మాత్రం కొనసాగుతూనే వుంది అని చెప్పుకొచ్చారు.