తెలుగు ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ అంటే ఎంతగా అభిమానిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  పునాధిరాళ్లు చిత్రంతో ఎలాంటి సినీ బ్యాగ్ గ్రౌండ్ లేకుండా అడుగు పెట్టిన మెగాస్టార్ చిరంజీవి ఇంతింతై వటుడింతైై అన్న చందంగా టాలీవుడ్ లో స్టార్ హీరోగా ఎదిగారు.   ఆయన కుటుంబం నుంచి ఇప్పటికీ అరడజను మంది హీరోలు వెండి తెరకు పరిచయం అయ్యారు. ప్రముఖ కమెడియన్ పద్మశ్రీ అల్లు రామలింగయ్య కూతురు సురేఖను వివాహం చేసుకున్న మెగాస్టార్ చిరంజీవి తన కుటుంబం అంటే ఎంత ప్రేమాభినామాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.   ఆయన తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘చిరుత’ చిత్రంతో హీరోగా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. 

 

తాజాగా రామ్ చరణ్ తన తల్లి సురేఖ పుట్టినరోజు వేడుకలు స్వగృహంలో జరిపారు. చరణ్ భార్య ఉపాసనతో కలిసి ఆయన అమ్మగారైన సురేఖ గారి పుట్టినరోజు సెలెబ్రేట్ చేశారు. సురేఖ తనయుడు రామ్ చరణ్, కోడలు ఉపాసన బర్త్ డే విషెస్ తెలియజేశారు. "హ్యాపీ బర్త్ డే అత్తమ్మా... లవ్యూ" అంటూ ఉపాసన ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేశారు. ఉపాసన పోస్టు చేసిన ఫొటోలో రామ్ చరణ్, ఉపాసన మధ్యలో సురేఖ చిరునవ్వులు చిందిస్తూ ఉన్నారు.

 

ఇక ఆమెతో కేక్ కట్ చేయించడంతో పాటు, ఆప్యాయంగా ఆలింగనం చేసుకొని ఆనందం పంచుకున్నారు.  చరణ్, తల్లికి విలువైన బర్త్ డే గిఫ్ట్ ఇచ్చినట్టు తెలుస్తుంది.  రామ్ చరణ్ తన  తల్లికి హ్యాపీ బర్త్ డే అమ్మా అంటూ దీవెనలు తీసుకున్నారట.  ప్రస్తుతం హీరో రామ్ చరణ్ నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే.  ఇప్పటికే తన తండ్రితో ఖైదీ నెంబర్ 150 , సైరా నరసింహారెడ్డి చిత్రాలకు నిర్మాణ సారథ్యం వహించారు.  ప్రస్తుతం రాజమౌళి దర్వకత్వంలో ఆర్.ఆర్.ఆర్ చిత్రంలో నటిస్తున్నారు.  ఆర్.ఆర్.ఆర్ వచ్చే ఏడాది జనవరి 8న విడుదల కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: