తెలుగు ఇండస్ట్రీలో ముకుంద, ఒక లైలా కోసం చిత్రాలతో హీరోగాయిన్ గా పెద్దగా పేరు తెచ్చుకోలేక పోయిన బాలీవుడ్ బ్యూటీ పూజా హెగ్డే తర్వాత బాలీవుడ్ లోకి వెళ్లింది.  అక్కడ పెద్దగా సక్సెస్ కాకపోవడంతో మళ్లీ తెలుగు ఇండస్ట్రీవైపు దృష్టి పెట్టింది.  అదే సమయంలో హరీష్ శంకర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన ‘దువ్వాడ జగన్నాథం’ చిత్రంలో ఈ అమ్మడి స్కిన్ షోకి కుర్రాళ్లు ఫిదా అయ్యారు.  ఈ చిత్రం తర్వాత పూజా హెగ్డేకి తెలుగు లో స్టార్ హీరోల సరసన వరుసగా ఛాన్సులు రావడం మొదలయ్యాయి. 

 

ఈ ఏడాది త్రివిక్రమ్ - అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన ‘అల వైకుంఠపురములో’ భారీ విజయం అందుకుంది.  ప్రస్తుతం రాధా కృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వస్తున్నచిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది.  సాధారణంగా స్టార్ హీరోయిన్లతో ఎవరికైనా ఒక్క సెల్ఫీ తీయించుకోవాలని.. వారితో మాట్లాడాలని అభిమానులకు కోరిక ఉంటుంది.  కానీ వారు బయటకు వస్తే చుట్టు బౌన్సర్ల సెక్యూరిటీ ఉండటంతో వీలు పడదు.  అయితే ఎయిర్ పోర్ట్ లో మాత్రం ఇలాంటి ఛాన్సులు దొరుకుతుంటాయి.  తాజాగా పూజా హెగ్డే ఎయిర్ పోర్ట్  లో ఉండగా ఓ అంకుల్ కూడా పూజా హేగ్దేతో సేల్ఫీ దిగాలని ఎంతో ట్రై చేశాడు పాపం.. కానీ అతనికి లక్ కలిసిరాలేదు. 

 

పూజా హేగ్దే కనిపించడంతో అందరు ఆమెతో సేల్ఫీ కోసం ట్రై చేశారు. అయితే సెల్ఫీ కోసం వచ్చిన అంకుల్ తో పూజా నవ్వుతూ సెల్ఫీ తీసుకోవాలని చూసినా అతనికి ఫోన్ మాత్రం టైమ్ సహకరించలేదు.  పూజాహెగ్డే ని చూసిన ఆనంతంలో ఉబ్బి తబ్బిబ్బై పోయాడు.  అంకుల్ సేల్ఫీ దిగాబోతుండగా ఫోన్ జారిపోయింది. ఇక చివరగా ఫోన్‌ను అటు మార్చి ఇటు మార్చి మొత్తానికి ఏదో ఒకటి చేసారు. అయిన పాపం కుదరలేదు. నిజానికి ఎవరు కూడా అంతసేపు వెయిట్ చేయరు కానీ పూజా అతనికోసం బాగానే వెయిట్ చేసింది. తాజాగా ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

Sethji aapka phone hogaya vasool🤪

A post shared by Viral Bhayani (@viralbhayani) on

మరింత సమాచారం తెలుసుకోండి: