తెలుగు ఇండస్ట్రీలో నటి శ్రీరెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. తెలుగు ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ జరుగుతుందని.. నటిగా మారాలంటే పడక సుఖం అందించాల్సిందే అని కామెంట్స్ చేసింది.  అలా బలైన వారిలో తానుకూడా ఉన్నానని సంచలన వ్యాఖ్యలు చేసింది. అంతేకాదు కాస్టింగ్ కౌచ్ పై పెద్ద ఎత్తున ఉద్యమం తీసుకు వచ్చారు..   ఆ సమయంలో శ్రీరెడ్డికి ఎంతోమంది బాసటగా నిలిచారు. అదే సమయంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాన్ పై అనుచిత వ్యాఖలు చేసింది. దాంతో  ఆమెకు అందరూ వ్యతిరేఖం అయ్యారు. ఆ తర్వాత చెన్నై కి వెళ్లిపోయింది.

 

గతంలో ఎన్నో వివాదాస్పద కామెంట్స్ చేస్తూ వచ్చిన శ్రీరెడ్డి గత కొంత కాలంగా సైలెంట్ గా ఉంది. తమిళనాడు వెళ్ళిపోయి అక్కడ విశాల్ తదితర నటులపై సంచలన కామెంట్స్ చేసి కాలం వెళ్లదీసింది.  ఇటీవల కరాటే కళ్యాణి , డ్యాన్స్ మాస్టర్ రాకేష్ పైన బూతుల దండకం చదివిన శ్రీ రెడ్డి. తాజాగా మరో వివాదాన్ని రేపింది.  స్టార్ ప్రొడ్యూసర్  సురేష్ బాబు హైదరాబాద్ లోని నానక్ రామ్ గూడా లోని రామానాయుడు స్టూడియోను ఒక కన్స్ట్రక్షన్ కంపెనీకి అమ్మేశారని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ స్టూడియో ఉండబోదని పలువురు ఎమోషనల్ గా రియాక్ట్ అయ్యారు. అందరూ ఒకవైపు అయితే శ్రీరెడ్డి మరోవైపు అన్నట్టు.. తాజాగా మరోసారి సంచలన వ్యాఖ్యలుచేసింది.  అభిరామ్ కు ఫస్ట్ నైట్ జరిగిన ఈ ప్లేస్ ఇక ఉండబోవట్లేదు అని వ్యాఖ్యానించింది. 

 

అప్పట్లో తనతో చాలా క్లోజ్ గా కూడా మూవ్ అయ్యాడని వ్యాఖ్యలు చేసి పెద్ద దుమారమే రేపింది. దీనికి ప్రూఫ్స్ అంటూ ఇద్దరూ క్లోజ్ గా ఉన్న కొన్ని ఫోటోలు, వాట్సాప్ చాట్ లను రివీల్ చేసింది.  తాజాగా శ్రీరెడ్డి చేసినకామెంట్స్ పై నెటిజన్లు ఎవరికి తోచినట్లుగా వారు రియాక్ట్ అవుతున్నారు. కొందరు శ్రీరెడ్డికి మద్దతిస్తుంటే, మరికొందరు ఆమెను తిట్టిపోస్తున్నారు. నీకు ఇష్టమై తిరిగి ఇప్పుడు ఇలా విమర్శించడం బాలేదంటూ చురకలు అంటిస్తున్నారు. ఏదేమైనా శ్రీరెడ్డి మరో వివాదం లేపడంలో సక్సెస్ అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: