వివాదాస్పద వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే వారిలో శ్రీరెడ్డి ముందువరసలో ఉంటారు. టాలీవుడ్ లో మీటూ ఆరోపణలతో శ్రీరెడ్డి చేసిన రచ్చ అంతాఇంతా కాదు. మీటూ ఉద్యమంలో భాగంగా అర్ధనగ్న ప్రదర్శన చేసి శ్రీరెడ్డి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ అయింది. ప్రస్తుతం చెన్నైలో సెటిలైన శ్రీరెడ్డి గత కొంతకాలంగా సైలెంట్ గా ఉంది. కానీ గత రెండు రోజుల నుండి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ శ్రీరెడ్డి మరలా వార్తల్లో నిలుస్తోంది. 
 
రెండు రోజుల క్రితం ఫేస్ బుక్ లైవ్ లో రాయడానికి వీలు లేని పదజాలంతో శ్రీరెడ్డి రాకేశ్ మాస్టర్, కరాటే కళ్యాణిపై ఘాటు విమర్శలు చేసింది. వినడానికి, చదవడానికి వీలు లేని మాటలతో శ్రీరెడ్డి లైవ్ లో రెచ్చిపోయింది. తాజాగా మరోసారి సోషల్ మీడియా ద్వారా దగ్గుబాటి అభిరామ్ ను ఉద్దేశించి శ్రీరెడ్డి మరో వివాదాన్ని రేపింది. గత రెండు రోజుల నుండి రామానాయుడు స్టూడియోస్ ను అమ్మేస్తున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో శ్రీరెడ్డి ఈ విషయం గురించి స్పందించింది. 
 
శీరెడ్డి తన ఫేస్ బుక్ ఖాతాలో తనకూ అభిరామ్ కు ఎక్కడైతే ఫస్ట్ నైట్ జరిగిందో ఆ స్టూడియో త్వరలో కనుమరుగు కానుంది అని పోస్ట్ చేసింది. శ్రీరెడ్డి చేసిన పోస్ట్ పై నెటిజన్లు రకరకాలుగా తమ స్పందనను వ్యక్తం చేస్తున్నారు. కొన్ని నెలల నుండి సైలెంట్ గా ఉన్న శ్రీరెడ్డి మరలా వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లోకెక్కుతూ ఉండటం గమనార్హం. ప్రముఖ నిర్మాత సురేష్ బాబు ఒక కన్స్ట్రక్షన్ కంపెనీకి రామానాయుడు స్టూడియోను అమ్మేశారని తెలుస్తోంది. 
 
స్టూడియోను అమ్మేశారని వార్తలు వస్తూ ఉండటంతో ఇప్పటికే పలువురు ప్రముఖులు ఎమోషనల్ గా రియాక్ట్ అయ్యారు. సురేష్ బాబు వైజాగ్ లో స్టూడియోను కట్టబోతున్నారని అందువలనే ఈ స్టూడియోను అమ్మేశారని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తల్లో నిజానిజాలు తెలియాల్సి ఉంది. గతంలో దగ్గుబాటి అభిరామ్ పై సంచలన ఆరోపణలు చేసిన శ్రీరెడ్డి తాజాగా మరోసారి వివాదస్పద వ్యాఖ్యలు చేయడంపై దగ్గుబాటి అభిమానుల నుండి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: