జబర్దస్త్ వంటి షో తో బుల్లి తెర మీద ఒక వెలుగు వెలుగుతున్న రంగమ్మత్త, అదేనండి అనసూయ భరద్వాజ్ ప్రస్తుతం సినిమాల మీద కూడా దృష్టి పెట్టింది. వస్తున్న ఆఫర్లను వదలకుండా చేస్తూ అటు బుల్లి తెరను ఇటు వెండి తెరను బ్యాలెన్స్ చేస్తుంది. అప్పుడప్పుడు వివాదాలతో కూడా సావాసం చేస్తుంది ఈ మమ్మీ. రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం సినిమాలో రంగమ్మత్త గా నటించి మెప్పించింది. ఆ సినిమాలో గ్లామర్ తో పాటు నటనలో కూడా తన టాలెంట్ ని చూపించింది. 

 

దీనితో అప్పటి నుంచి ఈమె కోసం దర్శకులు కొన్ని పాత్రలు కూడా రాసుకునే ప్రయత్నం చేస్తున్నారు. రాజశేఖర్ రెడ్డి బయోపిక్ యాత్ర లో కూడా ఈమె నటన మెప్పించింది. గౌరు చరిత గా మంచి ప్రదర్శన చేసింది. ఇక ఇప్పుడు ఈమెకు మంచి సినిమా ఆఫర్లే వస్తున్నట్టు సమాచారం. దాదాపు మూడు సినిమాల్లో ఈ హాట్ యాంకర్ నటిస్తుంది. పెళ్లి అయినా సరే ఏ మాత్రం గ్లామర్ తగ్గకుండా మైంటైన్ చేస్తూ అవకాశాలను దక్కించుకుంటుంది. ప్రస్తుతం అల్లు అర్జున్, సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. 

 

త్వరలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉంది. ఈ సినిమాలో లేడీ విలన్ పాత్ర ఒకటి ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఆ పాత్ర కోసం అనసూయని చిత్ర యూనిట్ సంప్రదించింది. సుకుమార్ ఆమె పై ఆసక్తి చూపించడం తో సినిమా చేయడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది అనసూయ. సినిమా మొత్తం ఆమె చుట్టూనే తిరుగుతుంది అని నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్ర అని, అందుకే అనసూయ సినిమాకు ఓకే చెప్పినట్టు సమాచారం. ఇది నిజమే అంటుంది టాలీవుడ్ కూడా. మరి ఎంత వరకు నిజమో చూడాలి అంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఎదురు చూడాల్సిందే. ఇక విజయ్ దేవరకొండ సినిమాలో కూడా ఈమె విలన్ అంటున్నారు. పవన్ కళ్యాణ్, క్రిష్ కాంబినేషన్ లో వచ్చే సినిమాలో కూడా ఈమె నటిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: