వరుస విజయాలతో మంచి ఫాం లో ఉన్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ వర్షం కురిపించింది. భరత్ అను నేను, మహర్షి సినిమాల తర్వాత చేసిన ఈ సినిమా మంచి హిట్ ఇవ్వడంతో ఇప్పుడు మహేష్ బాబు ఎవరితో సినిమా చెయ్యాలా అనే ఆలోచనలో ఉన్నాడు. ప్రస్తుతం వంశీ పైడపల్లి దర్శకత్వంలో సినిమా చెయ్యాలని ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమా త్వరలో సెట్స్ పైకి రానుంది. ఇక ఈ సినిమా తర్వాత సుకుమార్ తో కూడా సినిమా చేసే అవకాశం ఉందని తక వినపడుతుంది. 

 

వంశీ పైడపల్లి సినిమా వచ్చే నెల షూటింగ్ స్టార్ట్ అవనుంది. ప్రస్తుతం ఫ్యామిలీ తో ఎంజాయ్ చేస్తున్న మహేష్ బాబు తాజాగా ఒక ఇంటర్వ్యులో కీలక వ్యాఖ్యలు చేసాడు. పలు ప్రశ్నలకు సమాధానంగా మహేష్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఒకవేళ మీ బయోపిక్ తెరకెక్కితే, మీ పాత్రలో ఎవరు నటిస్తే బాగుంటుంది అనే ప్రశ్నకు గాను ఆసక్తికర సమాధానం చెప్పాడు. నాది చాలా సింపుల్, బోరింగ్ లైఫ్ అని తన బయోపిక్ వర్కౌట్ అవ్వదని స్పష్టంగా చెప్పాడు.

 

ఒకవేళ మీరు లాంగ్ రోడ్ ట్రిప్‌కు వెళితే మీతోపాటు సినీ ఇండస్ట్రీకి చెందిన ఎవర్ని తీసుకెళ్తారనే ప్రశ్నకు గాను, చరణ్‌, తారక్‌ ని అని చెప్పిన మహేష్ బాబు, అలాగే బ్యాలెన్స్‌ చేయడానికి చిరంజీవిగారిని తీసుకెళ్తానని చెప్పాడు. ఇక ఇదిలా ఉంటే మహేష్ బాబుకి రామ్ చరణ్ ఫ్యామిలీ తో మంచి సంబంధాలు ఉన్న సంగతి తెలిసిందే. ఒకరి ఇంటికి మరొకరు కార్యక్రమాలకు కూడా హాజరవుతూ ఉంటారు. మహేష్ భార్య నమ్రత, రామ్ చరణ్ భార్య ఉపాసన ఇద్దరూ వ్యాపార భాగస్వాములు అనే టాక్ కూడా టాలీవుడ్ లో ఉంది. ఇక సరిలేరు నీకెవ్వరు సినిమా కార్యక్రమానికి చిరంజీవి వచ్చిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: