ఈ మద్య టాలీవుడ్ లోకి వరుసగా కొత్త హీరోయిన్లు ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో కార్తికేయ హీరోగా నటించిన ‘హిప్పి’ మూవీతో హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయం అయ్యింది దిగాంగన సూర్యవన్షి.  ఈ మూవీ తర్వాత సోషల్ మీడియాలోతన ఫోటో షూట్స్ తో  కుర్రాళ్ల మనసు దోచింది  దిగాంగన సూర్యవన్షి.  అయితే హిప్పి పెద్దగా హిట్ కాకపోయినా తన అందచందాలతో యూత్ హృదయాలను దిగాంగన కొల్లగొట్టేసింది.  తాజాగా ఈ అమ్మడు ‘వలయం’  సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ మూవీ 21న రిలీజ్ కాబోతుంది. తాజాగా మూవీ ప్రమోషన్ బిజీలో చిత్ర యూనిట్ ఉన్నారు.  ఈ సందర్భంగా దిగాంగన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.  

 

ఈ సినిమాలో నేను 'దిశా' పాత్రలో కనిపిస్తాను. పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకున్న 'దిశా' హఠాత్తుగా కనిపించకుండా పోతుంది. ఆమె ఏమైపోయింది? అనే సస్పెన్స్ తో ఈ కథ నడుస్తుంది.  ఈ సినిమాలో ప్రతి ఒక్క సన్నివేశం ఉత్కంఠంగా కనిపిస్తుంది.  కెమెరా వర్క్ చాలా బాగా వచ్చిందని అన్నారు. ఈ మూవీ  'దిశా' పాత్ర చుట్టూ అనేక సమస్యలు అల్లుకుని కనిపిస్తాయి.  ఈ కాలంలో అమ్మాయిలు పడుతున్న ఇబ్బందులు ఎలా ఉన్నాయో ఈ సినిమాలో కనిపిస్తాయి అన్నారు.

 

మూవీ దిశ చుట్టూ తిరుగుతుంది కనుకనే  'వలయం' అనే పేరు పెట్టారు. కథ .. నా పాత్ర అందరికీ నచ్చుతాయనే నమ్మకం వుంది. ప్రస్తుతం 'సీటీమార్' సినిమా చేస్తున్నాను. ఈ సినిమాలో గోపీచంద్ జోడీగా కూడా ప్రాధాన్యమున్న పాత్రనే చేస్తున్నాను అంటూ చెప్పుకొచ్చింది. గతకొంత కాలంగా మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న గోపిచంద్ సైతం  సీటీమార్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.  మరి ఈ మూవీ ఇద్దరికి ఎంత వరకు కలిసి వస్తుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: