తెలుగు ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో బాలకృష్ణ, హరికృష్ణ.  అయితే హరికృష్ణ తన తండ్రి సీనియర్ ఎన్టీఆర్ కి సహాయకుడిగా రాజకీయాల్లోకి వెళ్లారు.  బాలకృష్ణ మాత్రం నటుడిగా కొనసాగుతూ వచ్చారు. నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే.  ఆయన తనయులు నందమూరి కళ్యాన్ రామ్, ఎన్టీఆర్ లు ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో హీరోలుగా కొనసాగుతున్నారు.  అయితే కళ్యాన్ రామ్ హీరోగా నటిస్తూనే పలు చిత్రాలకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.  గత కొంత కాలంగా కళ్యాన్ రామ్ హీరోగా నటించిన ఏచిత్రం కూడా సక్సెస్ కావడం లేదు.  వరుస ఫెయిల్యూర్స్ తో సతమతమవుతున్నాడు. ఈ సంక్రాంతి కానుకగా కళ్యాన్ రామ్ నటించిన ఎంత మంచి వాడవురా చిత్రం కూడా ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నాడు.

 

కెరీర్లో కళ్యాన్ రామ్ ఫ్లాపులతో ఇబ్బంది పడుతుంటే... ఎన్టీఆర్ మాత్రం వరుస విజయాలతో దూసుకు పోతున్నాడు. గతఏడాది త్రివిక్రమ్ దర్శకత్వంలో అరవిందసమేత తర్వాత ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ మల్టీస్టారర్ చిత్రం రూపొందుతుంది.  ఈ చిత్రం సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలని భావిస్తున్నారు.  అయితే  ఎన్టీఆర్ తన తదుపరి చిత్రం ఎవరితో తీయబోతున్నారు అని తెరపై ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి.  అల వైకుంఠపురములో చిత్రం  బ్లాక్ బస్టర్ తో ఎన్టీఆర్ - త్రివిక్రమ్ మూవీ కన్ఫర్మ్ అయ్యిందనే అన్నారు. లేటెస్ట్ గా ఎన్టీఆర్ - త్రివిక్రమ్ చిత్రం ఓ ట్విస్ట్ బయటికి వచ్చింది. త్రివిక్రమ్ వేరే హీరోతో కమిట్ అవుతున్నట్లు సమాచారం. 

 

మరోవైపు ఎన్టీఆర్ మరోసాని తన అన్న కళ్యాన్ రామ్ బ్యానర్ లో నటించబోతున్నట్లు టాలీవుడ్ టాక్. గతంలో ఎన్టీఆర్ హీరోగా ఆయన తెరకెక్కించిన 'జై లవ కుశ' భారీ విజయాన్ని సాధించింది. ఆ తరువాత ఎన్టీఆర్ .. కల్యాణ్ రామ్ ఎవరి సినిమాలతో వారు బిజీ అయ్యారు.  ఎన్టీఆర్ కోసం మంచి కథను తయారు చేయించే పనిలో కల్యాణ్ రామ్ వున్నాడని అంటున్నారు. ఎన్టీఆర్ 'ఆర్ ఆర్ ఆర్' ను పూర్తి చేసేలోగా మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీతో సిద్దం కావడానికి రెడీగా ఉన్నారట.  మరి కళ్యాన్ రామ్  ప్రయత్నం ఎంతవరకూ ఫలిస్తుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: