‘సరిలేరు నీకెవ్వరు’ సూపర్ సక్సస్ ను పూర్తిగా ఎంజాయ్ చేయకుండానే మహేష్ తన ఆరోగ్య కారణాల రీత్యా ప్రస్తుతం మహేష్ అమెరికాలో రెస్ట్ తీసుకుంటున్నాడు. ‘సరిలేరు నీకెవ్వరు’ ప్రపంచ వ్యాప్తంగా 150 కోట్ల షేర్ వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెపుతున్న నేపధ్యంలో మహేష్ టైమ్స్ సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికర విషయాలను వివరించి షాక్ ఇచ్చాడు.
ఈ సందర్భంగా మీరు ఒకరోజు నిద్ర లేచేసరికి మీకు తెలియకుండానే సీఎం అయితే మీరు ఏం చేస్తారు ? అనే ప్రశ్నకు సమాధానం చెబుతూ నేను సీఎం అయితే రాష్ట్రాన్ని దేవుడే కాపాడాలి అంటూ తన రాజకీయ ఎంట్రీ పై షాకింగ్ కామెంట్స్ చేసాడు. ఇదే సందర్భంలో మరొక ట్విస్ట్ ఇస్తూ ప్రస్తుతం తన దృష్టి అంతా సినిమాల పైనే ఉంది రాజకీయాల పై లేదు అంటూ క్లారిటీ ఇచ్చాడు.
ఇదే ఇంటర్వ్యూలో మరో ప్రశ్నకు సమాధానం ఇస్తూ తనకు సంబంధించి తన మనసులో ఉన్న ఒక షాకింగ్ కోరికను కూడ బయటపెట్టాడు. అవకాశం కలిసి వస్తే తాను చరణ్ జూనియర్ లతో కలిసి ఒక కార్ లో ఒక లాంగ్ డ్రైవ్ కు వెళ్లాలని ఉంది అంటూ మరొక షాకింగ్ కోరిక బయటపెట్టాడు.
ఇదే సందర్భంలో మరో ప్రశ్నకు సమాధానం ఇస్తూ తన బయోపిక్ ఎవరైనా తీస్తే అది చాల బోరింగ్ గా ఉంటుంది అంటూ తన బయోపిక్ ను చూసి ప్రేక్షకులు తట్టుకోలేరని తన పై తానే సెటర్లు వేసుకున్నాడు. మరి కొద్ది రోజులలో ‘సరిలేరు నీకెవ్వరు’ విడుదల అయి 50 రోజులు రన్ పూర్తి చేసుకుంటున్న సందర్భంలో మహేష్ తన అభిమానులతో తన ఆనందాన్ని షేర్ చేసుకోవడాని ఇలా టైమ్స్ ఆఫ్ ఇండియా మీడియా సంస్థ ద్వార ఈ ఇంటర్వ్యూ ఇచ్చి తన అభిమానులకు జోష్ ను ఇచ్చాడు..