కోలీవుడ్‌ లో అజిత్ ఒక మంచి అగ్ర కథానాయకుడు. ఆయన అద్భుతమైన నటుడే కాదు.. మంచి మనసున్న వ్యక్తి కూడా. అలాంటి అజిత్ గురించి షాకింగ్ వ్యాఖ్యలు చేసారు సినీ నటుడు పృథ్వీ. ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో తాను అజిత్‌ ని తప్పుగా అర్థం చేసుకున్నానని పృధ్వీ అన్నారు. అసలు ఆయన అజిత్ ను ఎప్పుడు కలిశాడు అసలు ఎప్పుడు ఏ విషయం పై గొడవ పడ్డారు లేక అసలు గొడవ ఎప్పుడు జరిగింది అనుకుంటున్నారా.. కానీ..ఇప్పటి గురించి కాదటండోయ్ .. ఎప్పుడో చదువుకునే రోజుల్లోది ఆయన ఇప్పుడు మనతో సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నాడు .

 

 

అసలు ఏం జరిగిందంటే.. అజిత్, పృథ్వీ సోదరి ఒకే స్కూల్ లో  చదువుకున్నారట. అయితే పృథ్వీ చెల్లెలు ఇంటికి రాగానే ఆమె డ్రెస్‌ కు బబుల్ గమ్ అంటుకుని ఉండేదట. రోజూ ఇలాగే జరుగుతుంటే పృథ్వీ ఏం జరిగిందని అడిగారట. అప్పుడు ఆమె స్కూల్ లో పృథ్వీ అనే వ్యక్తి ర్యాగింగ్ చేస్తున్నాడని చెప్పిందట. అయితే పృథ్వీ అజిత్ కుమార్ ర్యాగింగ్ చేస్తున్నాడనుకుని అతని పై కోపం పెంచుకున్నాడట.

 

 

ఆ తర్వాత ఇదే విషయం అజిత్‌ కు చెబితే.. ర్యాగింగ్ చేసింది అజిత్ కుమార్ కాదు అజిత్ మేనన్ అని తెలిసిందట. దాంతో తాను ఎంత తప్పుగా ఆలోచించాను అనుకుని అది ఆలోచించుకుని పృథ్వీ బాధపడ్డారట. ఈ విషయాన్ని అజిత్ కూడా ఒకానొక సందర్భంలో వెల్లడించారు. 

 

 

ప్రస్తుతం అజిత్ ‘వాలిమాయ్’ అనే సినిమా షూటింగ్‌ లో బిజీగా ఉన్నారు. 1998లో వచ్చిన ‘అవల్ వరువల’ అనే సినిమాలో అజిత్, పృథ్వీ కలిసి నటించారు. ఈ సినిమాకు బోనీ కపూర్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. గతేడాది అజిత్ నటించిన ‘నేర్కొండ పార్వాయ్’ సినిమాను కూడా బోనీ కపూరే నిర్మించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: