టీం ఇండియాకు దాదాపు 15 ఏళ్ళ పాటు సేవలు అందించి ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్న యువరాజ్ ఇక లైఫ్ ని ఎంజాయ్ చెయ్యాలి అనుకుంటున్నాడు. క్యాన్సర్ ను జయించినా సరే క్రికెట్ లో కొన్ని రాజకీయాలను జయించలేక క్రికెట్ నుంచి తప్పుకున్నాడు. కొంత మంది స్టార్ ఆటగాళ్ళు చేసిన రాజకీయం యువీ కెరీర్ ని అమాంతం వెనక్కు నెట్టింది. ఎన్ని సేవలు జట్టుకి చేసినా సరే తనను అవమానించడం తో అవమాన భారంతో యువరాజ్ క్రికెట్ నుంచి తప్పుకున్నాడు. ఇక ఇప్పుడు తన ఫ్యామిలీ తో లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నాడు.

 

క్రికెట్ నుంచి తప్పుకున్న యువరాజ్ కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. ఒక క్రికెట్ లీగ్ లో కూడా ఆడాడు. ఇటీవల ఆస్ట్రేలియా వెళ్లి ఒక చారిటీ మ్యాచ్ లో ఆడాడు కూడా. అయితే ఇప్పుడు మళ్ళీ తన అభిమానులను అలరించడానికి సిద్దమవుతున్నాడు. అయితే ఈ సారి క్రికెట్ తో మాత్రం కాదు. ఒక వెబ్ సీరీస్ తో. ఒక వెబ్ సీరీస్ లో నటిస్తున్నాడు ఈ మాజీ టీం ఇండియా స్టార్ ఆటగాడు. అసోం రాష్ట్రానికి చెందిన డ్రీమ్‌హౌజ్‌ ప్రొడక్షన్స్‌ నిర్మిస్తున్న వెబ్ సీరీస్ లో యువరాజ్ నటిస్తున్నాడు. 

 

అతని సోదరుడు జొరావర్‌ సింగ్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. యువి భార్య హజెల్‌ కీచ్‌ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక్కడ మరో విశేషం ఏంటీ అంటే, యువీ తల్లి షబ్నమ్‌ సింగ్‌ ఈ వెబ్‌సిరీస్‌ సహ నిర్మాత కూడా. దీనిపై ఆమె మాట్లాడారు. “ఈ ప్రపంచం అసలైన యువరాజ్‌ సింగ్‌, జొరావర్‌ సింగ్‌ ను వీక్షించబోతుంది. ఈ వెబ్‌సిరీస్‌ లో కీలక రోల్ ని నా చిన్న కొడుకు జొరావర్‌ చేస్తున్నాడు. నా కోడలు, నా కుమారులను చూసి ఒక తల్లిగా ఎంతో గర్విస్తున్నానని ఆమె తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: