పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల వరస ప్రాజెక్టులతో ఇండస్ట్రీలో బిజీ హీరోగా మారాడు. ఇటీవల బీజేపీ పార్టీతో పొత్తులు పెట్టుకున్న తర్వాత సినిమా రంగంపై గట్టిగా దృష్టిసారించినట్లు అర్థమవుతుంది. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పింక్ అనే రీమేక్ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సినిమా తర్వాత హరీష్ శంకర్ మరియు క్రిష్ డైరెక్టర్లతో సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. ఇటువంటి తరుణంలో తన కెరీర్లో అదిరిపోయే సినిమాలు ఇచ్చిన స్నేహితుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో మరొక సినిమా పవన్ కళ్యాణ్ చేయడానికి రెడీ అవుతున్నట్లు ఫిలింనగర్ లో వార్తలు వినబడుతున్నాయి.

 

ఇటీవల త్రివిక్రమ్ 'అలా వైకుంఠపురం లో' సినిమాతో అదిరిపోయే హిట్ అందుకున్నాడు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో తెరకెక్కించిన ఈ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అయింది. గతంలో వీరిద్దరి కలయికలో రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ అవ్వటంతో అలా వైకుంఠపురం లో  సినిమాతో హ్యాట్రిక్ విజయాన్ని సాధించారు. ఇటువంటి తరుణంలో త్రివిక్రమ్ తాజాగా పవన్ కళ్యాణ్ తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. అంతేకాకుండా రాజకీయ నేపథ్యం జరిగిన స్టోరీ తో పవన్ కళ్యాణ్ ని సరి కొత్తగా చూపించడానికి త్రివిక్రం రెడీ అవుతున్నారట.

 

మామూలుగా అయితే 'అలా వైకుంఠపురం లో' సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తో చేయాలని త్రివిక్రమ్ డిసైడ్ అయ్యారట. కానీ ఎన్టీఆర్ నటిస్తోన్న 'RRR' సినిమా షూటింగ్ ఆలస్యమవుతున్న కారణంగా ఈలోగా పవన్ తో సినిమా చేయాలని త్రివిక్రమ్ భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఒక పక్క రాజకీయాలు చేస్తూ మరో పక్క పింక్ సినిమా షూటింగ్ చేస్తున్నాడు. వచ్చే వేసవిలో పింక్ సినిమా విడుదల కానుంది. ఈ సినిమా అయిన వెంటనే డైరెక్టర్ క్రిష్ తో చేయాలని...ఆ తర్వాత త్రివిక్రమ్ తో అంతా ఓకే అయితే పవన్ సినిమా చేసే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: