ఓంకార్.. ఈ పేరు తెలియని బుల్లితెర ప్రేక్షకులు ఉండరు అనడంలో ఎలాంటి సందేహం లేదు. బుల్లితెర యాంకర్ గా ఎంతోమందికి ఉపాధి కల్పించి, సినీ రంగంలో స్టార్ డైరెక్టర్ గా ఎదిగిన ఓంకార్‌కు ఓ ప్ర‌త్యేకమైన‌ గుర్తింపు ఉంది. టెలివిజన్ యాంకర్ స్థాయినుంచి తెలుగు ఇండస్ట్రీలో టాలెంట్ గల దర్శకునిగా ఎదిగిన ఈయ‌న గురించి ఎంత చెప్పినా త‌క్కువే. ఒక పక్క సినిమాలు మరోపక్క అదిరిపోయే షోలతో ఓంకార్ తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు.అలా స్టార్ మా లో బిగ్గెస్ట్ రియాలిటీ షో అయినటువంటి బిగ్ బాస్ ను రీప్లేస్ చేస్తూ `సిక్త్స్‌ సెన్స్` అని ప్రోగ్రామ్ ను స్టార్ట్ చేసారు.

 

ఇది కూడా ఇప్పుడు మూడు సీజన్లను పూర్తి చేసుకోబోతుంది. వాస్త‌వానికి ఈ షో సూపర్ హిట్ కావడంతోనే మెగాఫోన్ చేతపట్టి రాజుగారి గది చిత్రంతో హిట్ కొట్టాడు. ఈ సినిమాకు రెస్పాన్స్ అదిరిపోవడంతో నాగార్జున హీరోగా రాజుగారి గదిని తెరకెక్కించి మోస్తరు విజయాన్ని అందుకున్నాడు. అంతేకాదు, డాన్స్ రియాల్టీ షోతో బుల్లితెరమీద అన్నయ్య అని పిలిపించుకున్న ఓంకార్, ఆ షో ద్వారా ఎందరో టాలెంటెడ్ కొరియాగ్రాఫర్లను అందించాడు. ఇదిలా ఉంటే.. బిగ్‌బాస్ వంటి బిగ్గెస్ట్ రియాలిటీ గేమ్ షోను పరిచయం చేసిన స్టార్ మా మరో అల్టీమేట్ రియాలిటీ షోను మన ముందుకు తీసుకురాబోతుంది. 

 

అలాగే 12 మంది సెలబ్రెటీ కపుల్స్‌తో, దాదాపు 18 వారాల పాటు సాగే ఈ గేమ్ షో కొనసాగనుంది. ఇక మ‌థ్య‌లో ఈ టాపిక్ ఎందుకు చెప్పానంటే.. ఈ అదిరిపోయే అల్టీమేట్ రియాలిటీ షోకు ఓంకారే యాంక‌ర్ కాబ‌ట్టి.  ఓంకార్ యాంకర్‌గా చేస్తున్న ఈ గేమ్ షోకు ఇస్మార్ట్ జోడీగా పేరు పెట్టారు. అయితే 12 సెలబ్రెటీ జోడీలు, 18 వారాల పాటు పాల్గొన్న ఈ గేమ్ షో బిగ్గెస్ట్ ఫైట్‌లో టైటిల్ ఏ జోడీ గెలుచుకుంటుందో ఆ జోడి ఇస్మార్ట్ జోడీగా నిలుస్తుంది. అయితే ఈ రియాలిటీ షో ఫిబ్రవరి 23 నుంచి ప్రారంభం కానుండగా, శని మరియు ఆదివారం రాత్రి 9 గంటలకు స్టార్ మాలో ప్రసారం కానుంది. మ‌రి ఈ షో ఎంత వ‌ర‌కు స‌క్సెస్ అవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: