టాలీవుడ్ సెన్షేషనల్ హిట్ ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో డైరెక్ట్గా బాలీవుడ్ లోనూ ఛాన్స్ దక్కించుకున్నాడు సందీప్ రెడ్డి వంగా. ‘అర్జున్ రెడ్డి’ సినిమాను ‘కబీర్ సింగ్’ టైటిల్తో రీమేక్ చేసి అక్కడ కూడా సూపర్హిట్ అందుకున్నాడు. దాంతో బాలీవుడ్ లో సందీప్కు వరుసగా అవకాశాలు వచ్చి పడ్డాయి. టీ సిరీస్లాంటి పెద్ద నిర్మాణ సంస్థ సందీప్తో కలిసి సినిమాని నిర్మించాలని అనుకున్నారు. సందీప్ బాలీవుడ్ స్టార్ హీరో రణ్బీర్ కపూర్తో కలిసి ఓ సినిమా చేయాల్సి ఉందని ఎప్పటినుంచో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే సందీప్ ఏ హీరో సినిమా చేయాలన్నా ప్రస్తుతం ఆ హీరోల చేతిలో ఉన్న సినిమాలను కంప్లీట్ చేయాలని తాజా సమాచారం.
ఈ నేపథ్యంలోనే టీ సిరీస్ సంస్థతో సందీప్ చేయాల్సిన సినిమా క్యాన్సిల్ అయిందని బాలీవుడ్ వర్గాల నుండి అందిన తాజా సమాచారం. దాంతో మళ్లీ సందీప్ టాలీవుడ్కే వచ్చేసినట్లు తెలుస్తోంది. ఓ స్టార్ హీరోతో తెలుగు సినిమా చేయాలని నిర్ణయించుకున్నారట. అయితే రణ్బీర్తో సినిమా విషయంలో టీ సిరీస్ సందీప్కు షాకిచ్చింది కాబట్టి.. తెలుగు సినిమాను నిర్మిస్తామని సర్దిచెప్పినట్లు తెలుస్తోంది. కానీ సందీప్లాంటి క్రియేటివ్ డైరెక్టర్కు హిందీలో మరో మంచి సినిమా పడి ఉంటే.. ఆయన అక్కడ పెద్ద దర్శకులకు గట్టి పోటీనిచ్చేవారని చాలామంది అభిప్రాయపడుతున్నారు.
సందీప్ తెరకెక్కించిన ‘కబీర్ సింగ్’ సినిమాను ఎన్ని వివాదాలు చుట్టుమట్టాయో అందరికీ తెలిసిందే. సమంత, అనసూయ లాంటి ఎందరో ప్రముఖులు సందీప్ తన సినిమా గురించి సమర్ధించుకుంటూ చేసిన కామెంట్స్పై మండిపడ్డారు. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ సినిమాలు రిలీజ్ అయ్య ఎన్నో నెలలు అయిపోతున్నా ఇప్పటికీ చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటివరకు ఎంతో మంది సెలబ్రిటీలు కబీర్ సింగ్ సినిమాను తప్పుబట్టినప్పటికి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ విద్యా బాలన్ మాత్రం సమర్ధించారు. మంచి సినిమా తీశాడంటూ ప్రశంసలు కురిపించింది.