శ్రీను వైట్ల డైరక్షన్ లో ఆకాష్ హీరోగా తెరకెక్కిన ఆనందం సినిమా అప్పట్లో యూత్ ఆడియెన్స్ కు బాగా నచ్చింది. 2001లో వచ్చిన ఆ సినిమా అప్పట్లో మంచి విజయాన్ని అందుకుంది. ఆ సినిమాతో తెలుగు పరిశ్రమకు పరిచయమైంది కన్నడ భామ రేఖ వేదవ్యాస్. అప్పటికే ఒక కన్నడ సినిమా మాత్రమే చేసిన అనుభవం ఉన్న రేఖా ఆనందం సినిమాలో చాలా బాగా నటించింది. ఆ తర్వాత నందమూరి తారకరత్న హీరోగా డెబ్యూ మూవీ ఒకటో నంబర్ కుర్రాడు సినిమాలో ఆమె లక్కీ ఛాన్స్ అందుకుంది.

 

సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోయినా ఆ మూవీలోని పాటలు ఇప్పటికి సూపర్ హిట్ అనిపిస్తాయి. ఆ సినిమా హిట్ అయితే రేఖ కెరియర్ ఇంకాస్త జోష్ గా ఉండేది. అప్పౌడే కింగ్ నాగార్జున, విజయభాస్కర్ డైరక్షన్ లో వచ్చిన మన్మథుడు సినిమాలో రేఖకు ఓ స్పెషల్ అప్పియరెన్స్ ఛాన్స్ వచ్చింది. ఆ సినిమా చేసే టైం లో నాగార్జున తనకు మరో సినిమా అవకాశం ఇస్తా అని అన్నారట. కాని ఇప్పటివరకు ఆ కాల్ రాలేదని అంటుంది రేఖా. కొన్నాళ్లుగా తెలుగు పరిశ్రమకు దూరమైన ఈ అమ్మడు కన్నడలో మాత్రం సినిమలు చేస్తూ బిజీ హీరోయిన్ గా మారింది.

 

లేటెస్ట్ గా ఆలి టాక్ షో.. ఆలితో సరదాగాకు వచ్చిన రేఖాతో ఆలి స్పెషల్ చిట్ చాట్ చేశాడు. ఇక బ్రతికున్న తనని మీడియా చంపేసిందన్న వార్తల పట్ల కూడా స్పందించింది రేఖా. తన కెరియర్ లో జరిగిన విషయాల పట్ల చాలా క్లియర్ కట్ గా చెప్పింది. ఛాన్స్ ఇస్తే ఇప్పుడైనా నాగ్ తో చేసేందుకు సిద్ధమే అంటుంది రేఖా. మరి నాగార్జున ఈ అమ్మడి అభ్యర్ధనని పట్టించుకున్తాడో లేదో చూడాలి. రేఖకి మాత్రం తెలుగు సినిమా చేయడమంటే ఇప్పటికి ఆసక్తి అని చెప్పింది.

మరింత సమాచారం తెలుసుకోండి: