టాలీవుడ్ లో రాం చరణ్ నటించిన నాయక్ సినిమాతో పరిచయమైన అమ‌లాపాల్‌ ద‌ర్శ‌కుడు విజ‌య్‌ను ప్రేమించి పెళ్లి చేసుకోవ‌డం, ఆ త‌ర్వాత ఇద్ద‌రి మ‌ధ్య మ‌న‌స్ప‌ర్థ‌లు రావ‌డంతో విడాకులు తీసుకోవ‌డం అన్న తతంగం కోలీవుడ్ లో టాలీవుడ్ లోనూ అందరికీ తెలిసిందే. వీళ్ళ పెళ్ళి పెటాకులయ్యాక విజ‌య్ తిరిగి ఓ డాక్ట‌ర్‌ను పెళ్లి చేసుకొని ఒకవైపు సంసార జీవితాన్ని ఎంజాయ్ చేస్తూనే తన పాటికి తను సినిమాలతో బిజీగా ఉన్నాడు. అలానే అమ‌లాపాల్ కూడా హీరోయిన్‌గా సినిమాలు చేస్తూ బిజీబిజీగా ఉంటున్నారు. అయితే రీసెంట్‌గా దర్శకుడు విజయ్‌ తండ్రి, నిర్మాత, నటుడు ఏఎల్‌.అళగప్పన్ అసలు అమలాపాల్‌.. విజయ్‌ నుంచి విడిపోవడానికి కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కారణం అని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశాడు.

 

ధనుష్ నిర్మించిన ‘అమ్మ కణక్కు’ సినిమాలో నటించమని అమలాపాల్‌ను అడిగాడట. అయితే పెళ్లికి ముందు ఇకపై నటించనని చెప్పిన అమలాపాల్‌ మళ్లీ నటించడానికి సిద్ధమైందని.. అదే విజయ్‌కు, అమలా పాల్ కు మధ్య విడాకులకు దారి తీసిందని ఇది వరకే చెప్పారు. మాజీ మామ వ్యాఖ్య‌ల‌పై అమలా పాల్ ఇన్నాళ్ళకి స్పందించారు. 'మీ వివాహ రద్దుకు నటుడు ధనుష్‌ కారణమట కదా' అని అంటే .. ఎప్పుడో జరిగిన సంఘటనను ఇప్పుడు అడుగుతున్నారేంటని రివర్స్ లో అడిగి షాకిచ్చింది. విడాకులు తీసుకోవాలన్నది పూర్తిగా తన సొంత నిర్ణయమేనని ఇందులో ఇంకేవరి ప్రమేయం లేదని వెల్లడించింది.

 

అంతేకాదు అనవసరంగా ధనుష్ ని ఇందులోకి లాగొద్దని తెలిపింది. ఇక అమలా పాల్ ని మీరు మళ్లీ ప్రేమలో పడ్డట్టు ప్రచారం సాగుతోంది మరి అతనెవరో మాకు పరిచయం చేయరా ...పెళ్లెప్పుడు అన్న మాటకి అమల విచిత్రంగా  స‌మాధాన‌మిచ్చింది. నేను నటిస్తున్న సినిమాలను పూర్తి చేసిన తర్వాతే ప్రేమ, పెళ్లి  గురించి ఓపెన్ అవుతా అంటూ అమలాపాల్ చెప్పింది. దీన్ని బట్టి అమలా ప్రేమ‌లో ఉన్నార‌న్న విషయం చెప్పకనే చెప్పింది. అయితే ఈ సమాధానానికి కొందరు నెటిజన్స్ అమలా పాల్ ని ఘోరంగా ట్రోల్ చేస్తున్నారు. ప్రేమ అంటే బాగోదు .. మళ్ళీ ప్రేమలో ఉన్నావా చెప్పడానికి కాస్తైనా ఉండాలి.. అంటూ చిరాకు పడుతున్నారు. అయితే ఈసారి మాత్రం ప్రేమించింది ఒక బిజినెస్ మ్యాన్ అని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: