టాలీవుడ్ లో విజయ్ దేవరకొండని ఓవర్ నైట్ స్టార్ హీరో చేసింది అర్జున్ రెడ్డి సినిమా. పెళ్ళి చూపులు సినిమాతో హీరో అయినప్పటికి ఆ సినిమా మంచి హిట్ గా నిలిచినప్పటికి విజయ్ కి జనాలలో విపరీతమైన క్రేజ్ ని తీసుకువచ్చింది మాత్రం అర్జున్ రెడ్డి. ఒక్క విజయ్ కే కాదు ఈ సినిమా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ని స్టార్ డైరెక్టర్ ని చేసింది. అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ లో ఉన్న యంగ్ హీరోస్ నుండి స్టార్ హీరోస్ వరకు అందరూ సందీప్ వైపే చూశారు కూడా. అంతేకాదు అర్జున్ రెడ్డి బ్లాక్ బస్టర్ అవడంతో నెక్స్ట్ సినిమా సూపర్ స్టార్ మహేష్ బాబుతో అనుకున్నాడు సందీప్. అందుకు తగ్గట్టుగానే మహేష్ ని కలిసి ఒక లైన్ కూడా వినిపించాడు సందీప్. 

 

ఆ లైన్ మహేష్ కి కూడా బాగా నచ్చిందని ఫుల్ స్క్రిప్ట్ తో రమ్మన్నాడని ఆ మధ్య వార్తలు వచ్చాయి. అంతేకాదు ఈ విషయాన్ని మహేష్ ఫ్యాన్స్ బాగా సోషల్ మీడియాలో ఫ్రీ పబ్లిసిటీ కూడా చేశారు. కానీ ఆ తర్వాత మహేష్ మహర్షి, సరిలేరు నీకెవ్వరు సినిమాలు కూడా చేశాడు. కానీ సందీప్ రెడ్డికి సంబందించిన సినిమా గురించి మాత్రం అప్డేట్ లేదు.
అయితే ఈ గ్యాప్ లో సందీప్ కూడా ఖాలీగా ఏమీ లేదు. అర్జున్ రెడ్డి సినిమాని బాలీవుడ్ కి తీసుకెళ్ళాడు. మక్కీకి మక్కీగా దింపాడు. బాలీవుడ్ లో షాహిద్ కపూర్ కియారా అద్వాని జంటగా తెరకెక్కించిన కబీర్ సింగ్ బాలీవుడ్ లో రికార్డ్స్ క్రియోట్ చేసింది. 

 

కాంట్రవర్సీలతో పాటు అవార్డ్స్, రివార్డ్స్ ని తీసుకు వచ్చింది. అయితే ఈ సినిమాలో ముద్దుల గురించి అర్జున్ రెడ్డి సమయంలో షాలినీ పాండే ఎలా అయితే సంచలన వ్యాఖ్యలు చేసిందో, కియారా కూడా అలానే చేసింది. కానీ అవి పాజిటివ్ గా చేయడం ఇక్కడ అతి పెద్ద ట్విస్ట్. సందీప్ ప్రతీ సీన్ ని ప్రతీ షాట్ ని చాలా క్లియర్ గా వివరించేవాడని ముద్దు విషయం కూడా ఎలా పెట్టుకోవాలో చాలా డీటేయిల్డ్ గా చెప్పేవాడని తెలిపింది. కొన్ని సందర్భాలలో ముద్దు పెట్టుకునే ముందు ఎక్ప్రెషన్స్ ఎలా ఉండాలో చేసి చూపించేవాడని తెలిపింది. కొన్ని ముద్దు సీన్స్ ని ఎమోషనల్ గా ఫీలయ్యి నిజంగానే ఏడ్చానని అంతబాగా సీన్స్ వర్కౌట్ అయ్యాయని తెలిపింది. ఇక ఇన్ని ముద్దులు ఉంటాయనుకుంటే భయపడి ఒప్పుకునేదాన్ని కాదేమో అంటూ వ్యాఖ్యలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: