గత ఏడాది ఎఫ్ 2, వెంకీమామ తో వరస హిట్లు కొట్టి ఫుల్ జోష్ లో వున్న సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్  ఈసారి రీమేక్ తో రానున్నాడు. అందులో భాగంగా వెంకీ ప్రస్తుతం కోలీవుడ్ సెన్సేషనల్ బ్లాక్ బాస్టర్ మూవీ అసురన్ రీమేక్ లో నటిస్తున్నాడు. నారప్ప అనే టైటిల్ తో తెరక్కుతున్న ఈ చిత్రంలో ప్రియమణి,అమలా పాల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సెట్స్ మీదకు వెళ్లినప్పటి నుండి ఈ చిత్రం నాన్ స్టాప్ గా షూటింగ్ ను జరుపుకుంటుంది.
 
ఇటీవల అనంతపురంలో మొదటి షెడ్యూల్ పూర్తి కాగా ప్రస్తుతం రెండవ షెడ్యూల్ తమిళనాడులో జరుగుతుంది. ఈ షెడ్యూల్ సుమారు 30రోజుల పాటు జరుగనుంది దాంతో సగానికి పైగా షూటింగ్ కంప్లీట్ కానుంది. ఇక ఏప్రిల్ మొదటి వారం లోపు సినిమా ను పూర్తి చేసి మే లో ప్రేక్షకులముందుకు తీసుకురానున్నారు. ఇటీవల ఈసినిమా నుండి విడుదలైన వెంకీ ఫస్ట్ లుక్ పోస్టర్లు సూపర్ రెస్పాన్స్ ను తెచ్చుకోవడంతో సినిమా పై అంచనాలు పెరిగిపోయాయి. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఫేమ్ శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ తమిళ నిర్మాత కలై పులి ఎస్ తాను తో కలిసి సురేష్ బాబు నిర్మిస్తుండగా మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.
 
ఇక ఒరిజినల్ వెర్షన్ లో ధనుష్ , మలయాళ నటి మంజూ వారియర్ లీడ్ రోల్స్ లో నటించగా ట్యాలెంటెడ్ డైరెక్టర్ వెట్రి మారన్ తెరకెక్కించిన ఈ చిత్రం తమిళ  ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. గత ఏడాది విడుదలైన ఈ చిత్రం 70కోట్ల వసూళ్లను రాబట్టి బాక్సాఫీస్ ను షేక్ చేసింది. మరి ఈ సినిమాకు రీమేక్ గా వస్తున్న నారప్ప  ఎలాంటి  ఫలితాన్ని రాబడుతుందో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: