మాటల మాంత్రికుడు త్రివిక్రం శ్రీనివాస్ టేస్ట్ గురించి అందరికి తెలిసిందే. ఆయన తీసేది పక్కా కమర్షియల్ సినిమాలే అయినా మనుషుల ఎమోషన్స్ తోనే ఎక్కువ ఇంప్యాక్ట్ కలిగేలా చేస్తాడు. అల వైకుంఠపురములో సినిమా కథ ముందే చెప్పేసి కథనంతో రక్తి కట్టించాడంటే త్రివిక్రం టాలెంట్ ఏంటో అర్ధం చేసుకోవచ్చు. ఇక ఇప్పుడు తను డైరెక్ట్ చేసిన సినిమానే కాదు తన అసిస్టెంట్ చేసిన భీష్మ సినిమాకు అభయం ఇచ్చేస్తున్నాడు త్రివిక్రం. సినిమా పక్కా హిట్ అంటూ రీసెంట్ గా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో త్రివిక్రం అనడం జరిగింది.

 

సినిమా హారిక హాసిని సెకండ్ బ్యానర్ సితార వాళ్లదే. సో ఎలాకాదన్నా అది త్రివిక్రం సొంత బ్యానర్ అన్నట్టే లెక్క. అందుకే త్రివిక్రం సినిమా రిలీజ్ ముందే చూసి ఎడిటింగ్ లో కూడా కొన్ని తప్పొప్పులను సరిదిద్దారని టాక్. ఛలో సినిమాతో సత్తా చాటిన వెంకీ కుడుముల నితిన్ తో భీష్మ అంటూ ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్ తో రాబోతున్నాడు. నితిన్ సరసన రష్మిక మందన్న నటించిన ఈ సినిమాలో వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్క్ అవుట్ అయినట్టు తెలుస్తుంది. ట్రైలర్ ఇంప్రెస్ చేయగా సినిమా పక్కా హిట్ పార్టీకి నన్ను మర్చిపోకుండా పిలవండి అంటూ త్రివిక్రం చెప్పడం సినిమాకు పాజిటివ్ బజ్ ఏర్పడేలా చేసింది.

 

ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నితిన్ కూడా సినిమాపై పూర్తి కాన్ఫిడెంట్ తో మాట్లాడాడు. సినిమాలో కొన్నాళ్లుగా తను దూరంగా ఉంటున్న డ్యాన్స్ కూడా చేశానని చెప్పాడు. పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా వస్తున్న భీష్మ సినిమా అటు కామెడీతో పాటుగా కోర్ పాయింట్ కూడా చాలా కొత్తగా ఉంటుందని తెలుస్తుంది. మరి నితిన్ ఈ సినిమాతో కెరియర్ బెస్ట్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు. ఆ అంచనాలను అందుకుంటుందా లేదా అన్నది మరో రెండు రోజుల్లో తెలుస్తుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: