కథానాయికగా లావణ్యా త్రిపాఠి కెరీర్‌లో కొత్త దశ ప్రారంభమైంది. అందాల రాక్షసి, భలే భలే మగాడివోయ్, సోగ్గాడే చిన్ని నాయనా, శ్రీరస్తు శుభమస్తు, అర్జున్ సురవరం లాంటి విజయవంతమైన చిత్రాల్లో అందంతో పాటు అభినయానికి ఆస్కారమున్న పాత్రల్లో ఆమె నటించింది. గ్లామర్‌ రోల్స్‌తో పాటు నటనకు ఆస్కార్‌ ఉన్న పాత్రల్లోనూ నటిస్తూ తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటుంది ఈ భామ. ఇప్పుడు కథానాయికగా లావణ్యా త్రిపాఠి టాలెంట్‌ పై దర్శక నిర్మాతలు మరింత కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. అందుకే వైవిధ్యమైన పాత్రలు ఆమెను వెతుక్కుంటూ వస్తున్నాయి.

 

ప్రస్తుతం లావణ్యా త్రిపాఠి తెలుగులో రెండు సినిమాలు చేస్తోంది. ఏ1 ఎక్స్‌ప్రెస్, చావు కబురు చల్లగా...! సినిమాల్లో నటిస్తోంది లావణ్యా. సందీప్ కిషన్ కథానాయకుడిగా నటిస్తున్న ఏ1 ఎక్స్‌ప్రెస్ హాకీ నేపథ్యంలో రూపొందుతోంది. ఈ సినిమాలో లావణ్యా త్రిపాఠి హాకీ క్రీడాకారిణిగా కనిపించనుంది. క్యారెక్టర్‌ లో పర్‌ఫెక్షన్ కోసం హాకీ కోర్టులో తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తోంది. ఇతర సినిమాల షూటింగులతో బిజీగా ఉన్నా ఒక్క రోజు కూడా హాకీ శిక్షణకు డుమ్మా కొట్టడం లేదట. అవసరమైతే ఒక్కో రోజు రెండు గంటలు తక్కువ నిద్రపోతున్నారు. ఒక్కో రోజు కేవలం  రెండే గంటలు నిద్రపోతోంది.

 

తెలుగు సినిమాలతో పాటు ప్రస్తుతం లావణ్యా త్రిపాఠి ఒక తమిళ సినిమా కూడా చేస్తోంది. రోజంతా చెన్నైలో తమిళ సినిమా షూటింగ్ చేసి, నైట్ ఫ్లయిట్ క్యాచ్ చేసి హైదరాబాద్ వచ్చి మరీ.. ఎర్లీ మార్నింగ్ హాకీ ప్రాక్టీస్ చేసి, మళ్లీ చెన్నై వెళ్లి తమిళ సినిమా షూటింగ్ చేస్తోందట. ఇటీవల ఏ1 ఎక్స్‌ప్రెస్ లేటెస్ట్ షెడ్యూల్ షూటింగ్ స్టార్ట్ చేశారు. లావణ్యా త్రిపాఠి హార్డ్ వర్క్, డెడికేషన్ చూసిన సినిమా యూనిట్ ఆమెను అభినందిస్తున్నారు. ఏ1 ఎక్స్‌ప్రెస్‌ తో   పాటు లావణ్యా త్రిపాఠి నటిస్తున్న మరో తెలుగు సినిమా చావు కబురు చల్లగా...!. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పతాకంపై కార్తికేయ హీరోగా రూపొందుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: