ఎన్టీఆర్ బయోపిక్ తీసి ఎంతో పేరు తెచ్చుకోవాలని బాలకృష్ణ ప్రయత్నించినా పేరు రాలేదు కాని ఆ బయోపిక్ తో బాలయ్యకు కోట్లల్లో నష్టాలు వచ్చాయి. దీనితో తన సొంత సినిమాల నిర్మాణ ఆలోచనలు కూడ మానుకున్నాడు. ప్రస్తుతం రాజకీయంగా సినిమాల పరంగా ఏమాత్రం పరిస్థితి బాగాలేని బాలకృష్ణకు నిన్న మంచు ఫ్యామిలీ నుండి వచ్చిన ఒక ప్రకటన ఊహించని షాక్ ఇచ్చినట్లు సమాచారం.


ఎన్టీఆర్ జీవితంలోని ఒక కీలక ఘట్టాన్ని ఆధారంగా చేసుకుని ‘చదరంగం’ అన్న వెబ్ సిరీస్ ను నిర్మిస్తున్నట్లుగా మంచు విష్ణు ప్రకటించాడు. ఈ వెబ్ సిరీస్ లో మోహన్ బాబుకు మాత్రమే తెలిసిన ఎన్టీఆర్ జీవితం లోని ఆ కీలక ఘట్టం చుట్టూ ఈ వెబ్ సిరీస్ కథ ఉంటుందని మంచు విష్ణు చెపుతున్నాడు. 


అయితే ఇది ఎన్టీఆర్ బయోపిక్ కాదనీ కేవలం ఎన్టీఆర్ ను మానసిక క్షోభకు గురిచేసిన ఆ సంఘటన చుట్టూ ఈ వెబ్ సిరీస్ ఉంటుందని మంచు విష్ణు చెపుతున్న నేపధ్యంలో ఆ సంఘటన ఏమిటి అంటూ అప్పుడే ఊహాగానాలు మొదలైపోయాయి. శ్రీకాంత్ ఎన్టీఆర్ గా నటిస్తున్న ఈ వెబ్ సిరీస్ కు రాజ్ అనంత దర్శకత్వం వహిస్తున్నాడు. 


జీ 5 ఒటిటి ప్లాట్ ఫామ్ లో ప్రసారం కాబోతున్న ఈ వెబ్ సిరీస్ ఖచ్చితంగా రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తాయని భావిస్తున్నారు. దీనితో నందమూరి ఫ్యామిలీని అదేవిధంగా తెలుగుదేశ అధినాయకత్వాన్ని కార్నర్ చేసే అంశాలు ఈ వెబ్ సిరీస్ లో ఉండి తీరుతాయి అన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఈ వార్తలు బాలకృష్ణ వరకు రావడంతో అసలు వాస్తవాలు తెలుసుకోవాలని తనకు బాగా సన్నిహితుడైన మోహన్ బాబు ద్వారా వాస్తవాలు సేకరించే పనిలో పడినట్లు టాక్. ఇప్పటికే గత సంవత్సరం విడుదలైన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చేసిన డామేజ్ నుండి కోలుకోలేకపోతున్న ఎన్టీఆర్ ఫ్యామిలీకి ఇదొక షాక్..

 

మరింత సమాచారం తెలుసుకోండి: