చలో  సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమై మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది రష్మిక మందన. ప్రస్తుతం రష్మిక మందన కి యూత్ లో విపరీతమైన క్రేజ్ ఉంది.వరుస  అవకాశాలు దక్కించుకుంటూ మంచి విషయాలను తన ఖాతాలో వేసుకుంటుంది ఈ అమ్మడు. తెలుగుతో పాటు కన్నడ ఇండస్ట్రీలో కూడా వరుస  సినిమా అవకాశాలు దక్కించుకుంటూ... ప్రస్తుతం బిజీబిజీగా గడుపుతోంది. విజయ్ దేవరకొండ తో చేసిన గీతాగోవిందం సినిమాతో ఒక్కసారిగా తెలుగు ప్రేక్షకులందరికీ దగ్గరైపోయింది రష్మిక మందన. ఇక ఆ తర్వాత మరోసారి విజయ్ దేవరకొండ సరసన డియర్ కామ్రేడ్ లో నటించి మరింత క్రేజ్ సంపాదించింది. ఇక మొన్నటికి మొన్న ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన చాన్స్ కొట్టేసి సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటించింది. 

 

 

 సక్సెస్ఫుల్ దర్శకుడు అనిల్ రావిపూడి సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కిన  సినిమాలో నటించిన రష్మిక మందన్న సరిలేరు నీకెవ్వరు బ్లాక్ బస్టర్ హిట్ తో స్టార్ హీరోయిన్గా మారిపోయింది. ఈ సినిమా హిట్ తో ఎంతో మంది స్టార్ హీరోల సరసన చాన్స్ కొట్టేసింది రష్మిక మందన. ఇక తమిళంలో కూడా కార్తి సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది. కాగా ప్రస్తుతం తెలుగులో నితిన్ హీరోగా తెరకెక్కిన భీష్మ సినిమాలో నటించిన ఈ అమ్మడు... ఈ సినిమాలో తన నటనతోనే కాదు డాన్సులతో కూడా అదరగొట్టిన ట్లు తెలుస్తోంది. ఈ సినిమా శివరాత్రి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రస్తుతం చిత్ర బంధం ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీ బిజీగా ఉంది.  కాగా ఈ చిత్రం ప్రమోషన్ లో భాగంగా రష్మిక పలు ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకుంది. 

 

 

 ఇప్పటివరకు ఏ హీరోతో క్రష్ ఉంది అని  యాంకర్ అడిగిన ప్రశ్నకు... ఆసక్తికర సమాధానం చెప్పింది రష్మిక. తనకు తమిళ హీరో విజయ్ అంటే క్రష్ అని చెప్పుకొచ్చింది. ఆయనతో కలిసి బిగిల్ సినిమాలో నటించమని ఆఫర్ కూడా వచ్చిందని... కానీ చేతిలో వరుస సినిమాలు ఉండటంతో డేట్లు ఖాళీ లేక సినిమా చేయలేక పోయాను అంటూ చెప్పుకొచ్చింది. ఇక హీరో విజయ్ తో నటించేందుకు ఎంతో ఆసక్తిగా ఉన్నానని... అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను అంటూ చెప్పుకొచ్చింది. మరి ఈ అమ్మడి కోరిక ఎప్పుడు తీరుతుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: