టాలీవుడ్ లో అక్కినేని నాగార్జున తర్వాత ఆయన పెద్ద కుమారుడు అక్కినేని నాగ చైతన్య ‘జోష్’ సినిమాతో హీరోగా వెండి తెరకు పరిచయం అయ్యాడు.  ఈ సినిమా అంతంత మాత్రమే నడిచింది.  ఆ తర్వాత గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ‘ఏం మాయ చేసావె’ మూవీ తో మంచి హిట్ అందుకున్నాడు.  ఈ మూవీతో పరిచయం అయిన సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.  పెళ్లైన తర్వాత మూడు నెలలు గ్యాప్ తీసుకొని భార్య భర్తలు మళ్లీ సినిమాల్లో నటించడం మొదలు పెట్టాడు.  అయితే నాగ చైతన్యకు మాత్రం వరుసగా డిజాస్టర్స్ అవుతూ సతమతమయ్యాడు. 

 

కానీ సమంతకు మాత్రం వరుస హిట్స్ అందుకుంటూ వచ్చింది.  అయితే సమంత-చైతూ కలిసి నటించిన  మజిలీ సినిమా సూపర్ హిట్ అయ్యింది.  అప్పటి నుంచి చైతూకి బాగా కలిసి వచ్చింది.  తన మేమమామ వెంకటేష్ తో కలిసి నటించిన ‘వెంకిమామ’ సినిమా సూపర్ హిట్ అయ్యింది.   ఇలా వరుసగా హిట్స్ కలిసి వస్తున్న సమయంలో ఫ్యామిలీ దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న ‘లవ్ స్టోరీ’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.  ఈ మూవీలో ఫిదా హీరోయిన్ సాయి పల్లవి నటిస్తుంది.  ఈ మద్య రిలీజ్ అయిన టీజర్ కి మంచి స్పందన వచ్చింది.   

 

ఈ టీజర్ లో ఆర్డినరీ బాయ్ లా కనిపించాడు. ఏప్రిల్ 14 లేదా 16 ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుందని చెపుతున్న..ప్రస్తుత సమాచారం మేరకు ఏప్రిల్ లో రావడం కష్టమే అని అంటున్నారు. ప్రస్తుతం సినిమా షెడ్యూలు స్లో గా నడుస్తుంది. ఆర్మూర్ షెడ్యూలు డిలే గా పూర్తయింది.  మరికొన్ని రోజులు హైదరాబాద్ లో షూటింగ్ జరపబోతున్నారట.  తరువాత దుబాయ్ షెడ్యూలు వుంది. మూడు పాటల షూట్ వుంది. ఇవన్నీ మార్చి లోపు పూర్తయిపోవాలి. లేదూ అంటే ఏప్రిల్ లో అనుకున్న డేట్ కు రావడం కష్టమే అంటున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: