జయాపజయాలతో సంబంధం లేకుండా యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం వరస సినిమాలను లైన్లో పెట్టాడు. అందులో అంధధూన్ రీమేక్ కూడా ఒకటి. ఇటీవలే ఈ రీమేక్ రైట్స్ ను గట్టి పోటీ నడుమ నితిన్ దక్కించుకున్నాడు. ఇక ఈ చిత్రాన్ని స్వామి రారా ఫేమ్ సుధీర్ వర్మ డైరెక్ట్ చేయనున్నాడని వార్తలు వచ్చాయి అయితే తాజా సమాచారం ప్రకారం వెంకటాద్రి ఎక్ప్ ప్రెస్ ఫేమ్ మేర్లపాక గాంధీ ని ఈ రీమేక్ కి డైరెక్టర్ గా ఫిక్స్ చేశాడట నితిన్. ప్రస్తుతం గాంధీ పూర్తి స్క్రిప్ ను రెడీ చేసే పనిలో వున్నాడు. ఈఏడాది సెప్టెంబర్ లో షూటింగ్ ను మొదలు పెట్టి డిసెంబర్ లో సినిమా ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ప్లాన్ లో వున్నారు.  నితిన్ సొంత బ్యానర్ శ్రేష్ట్ మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ఒరిజినల్ వెర్షన్ లో బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురానా హీరోగా నటించగా  టబు,రాధికా ఆప్టే కీలక పాత్రల్లో నటించారు. శ్రీరామ్ రాఘవ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం 2018లో విడుదలై బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యింది. అంతేకాదు ఉత్తమ సినిమా విభాగంలో జాతీయ అవార్డు వరించింది. 

ఇదిలా ఉంటే మరో రెండు రోజుల్లో నితిన్, భీష్మ తో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. ఛలో ఫేమ్ వెంకీ కుడుముల తెరకెక్కించిన చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించగా మణిశర్మ తనయుడు మహతి స్వర సాగర్ సంగీతం అందించాడు. సితార ఎంటర్ టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఇక నితిన్ ప్రస్తుతం మరో రెండు సినిమాల్లో నటిస్తున్నాడు. అందులో తొలిప్రేమ ఫేమ్ వెంకీ అట్లూరి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న రంగ్ దే ఒకటి కాగా సాహసం ఫేమ్ చంద్రశేఖర్ యేలేటి తో చెక్ అనే సినిమా లో కూడా నటిస్తున్నాడు.  
 

మరింత సమాచారం తెలుసుకోండి: