టాలీవుడ్ లోకి అడుగు పెడుతున్న ఇతర భాష హీరోయిన్లు ఇక్కడ మంచి సక్సెస్ తో ముందుకు సాగుతున్నారు.  మాలీవుడ్, బాలీవుడ్ నుంచి ఇప్పటికే చాలా మంది హీరోయిన్లు తెలుగు లోకి ఎంట్రీ ఇచ్చారు.  కన్నడంలో కిర్రాక్ పార్టీతో హీరోయిన్ గా పరిచయం అయిన రష్మిక మందన తెలుగు లో నాగశౌర్య నటించిన ‘ఛలో’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది.  ఈ మూవీ మంచి హిట్ కాగానా వెంటనే విజయ్ దేవరకొండ సరసన ‘గీతాగోవిందం’ మూవీతో మరో బాక్సాఫీస్ హిట్ అందుకుంది.  అంతే ఇక తెలుగు లో రష్మికకు వరుసగా ఆఫర్లు రావడం మొదలు పెట్టాయి. అంతేకాదు తెలుగులో రష్మికకు మంచి ఫాలోయింగ్ పెరిగిపోయింది.

 

ఈ అమ్మడికి తమిళ నాట కూడా మంచి ఆఫర్లు వస్తున్నాయి.  ఈ ఏడాది అనీల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటించిన ‘సరిలేరు నకెవ్వరు’ సినిమాతో సూపర్ హిట్ అందుకుంది.  తాజాగా నితిన్ హీరోగా నటిస్తున్న భీష్మ మూవీతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన రష్మక తనకు తమిళ హీరో విజయ్‌ అంటే చాలా ఇష్టమని వెల్లడించింది. ‘చిన్నప్పట్నుంచీ విజయ్‌ సర్ అంటే క్రష్‌ ఉంది. ఆయనతో కలిసి బిగిల్‌ సినిమాలో నన్ను భాగస్వామి కావాలని చాలామంది కోరారు. అయితే, కొన్ని కారణాల వల్ల ఆ సినిమాలో చేయడం కుదరలేదు.

 

త్వరలో తనతో నటించే ఛాన్సు రావాలని దేవున్ని కోరుకుంటున్నా అంటూ చెప్పింది.  తెలుగుతో పాటు కన్నడ, తమిళంలోనూ ఆఫర్లు క్యూ కట్టడంతో ఆమె యమ బిజీ అయిపోయింది. త్వరలోనే కార్తీ హీరోగా వస్తున్న ‘సుల్తాన్‌’ సినిమాతో రష్మిక హీరోయిన్‌గా తమిళ ఇండస్ట్రీలోనూ రంగప్రవేశం చేయనుంది. అంతే కాదు సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో వస్తున్న మూవీలో కూడా ఈ కన్నడ బ్యూటీ చాన్స్ కొట్టేసింది. 
  

మరింత సమాచారం తెలుసుకోండి: