యూనివ‌ర్స‌ల్ స్టార్ క‌మ‌ల్‌హాస‌న్ న‌టిస్తున్న తాజా చిత్రం `భార‌తీయుడు 2`. ఈ చిత్రం త‌మిళంలో `ఇండియ‌న్ 2` పేరుతో శంక‌ర్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. లైకా ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ పై సుభాస్క‌ర‌న్ అత్యంత భారీ బ‌డ్జెట్‌తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. కాజ‌ల్ అగ‌ర్వాల్‌, సిద్ధ‌ర్థ్‌, ర‌కుల్‌ప్రీత్‌సింగ్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. 1996లో ఏ.ఎం. ర‌త్నం నిర్మించిన ఈ చిత్రం తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో సంచ‌ల‌నం సృష్టించింది. అప్ప‌ట్లో ఈ చిత్రం క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపించింది. దీనికి సీక్వెల్‌గా వ‌స్తున్న `భార‌తీయుడు 2` రెగ్యుల‌ర్ షూటింగ్ చెన్నైలోని బిన్నీ మిల్స్‌లో జ‌రుగుతోంది.

 

ఇప్ప‌టికే చెన్నై, హైద‌రాబాద్‌, రాజ‌స్థాన్‌లోని కీల‌క ప్ర‌దేశాల్లో సీన్స్‌ని షూట్ చేశారు. చైనా, థాయ్‌లాండ్‌ల‌లో ఓ కీల‌క షెడ్యూల్ ని ప్లాన్ చేశార‌ట‌. దీని కోసం మార్చి ఎండ్‌లో కానీ ఏప్రిల్ మొద‌టి వారంలో కానీ చైనా వెళ్లాల‌న్న‌ది `భార‌తీయుడు 2` టీమ్ ప్లాన్. కానీ ఆ ప్లాన్ వ‌ర్క‌వుట్ అయ్యేలా క‌నిపించ‌డం లేదు. దీనికి ప్ర‌ధాన కార‌ణం కరోనా వైర‌స్‌. గ‌త కొన్ని రోజులుగా క‌రోనా వైర‌స్ చైనా, థాయ్ లాండ్‌ల‌ని వ‌ణికిస్తున్న విష‌యం తెలిసిందే. ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న ప్ర‌జ‌ల్ని ఈ వ్యాధి వ‌ణికిస్తోంది. దీంతో ఈ చిత్ర ద‌ర్శ‌కుడు శంక‌ర్ తాజా షెడ్యూల్ని వాయిదా వేసిన‌ట్టు చెన్నై వ‌ర్గాలు చెబుతున్నాయి. ఇలా అయితే అనుకున్న స‌మ‌యానికి `భార‌తీయుడు 2` పూర్తియి రిలీజ్ కావ‌డం క‌ష్ట‌మే అంటున్నారు.

 

ఇక ఈ వ్యాధికి అంత భ‌య‌ప‌డాల్సిన ప‌రిస్థితి ఎందుకంటే ఇది ఒక‌రి నుంచి ఒక‌రికి గాలి ద్వారా సంక్ర‌మించే వ్యాధి కావ‌డంతో ప్ర‌తి ఒక్క‌రు దీనికి భ‌ప‌డుతున్నారు. అంతేకాక ఈ వ్యాధి వ‌చ్చిన‌వారు  తిరిగి కోల్కోక‌పోవ‌డంతో పాటు మృత్యువాత ప‌డుతున్నారు. ఈ వ్యాధి వ‌చ్చిన వారిలో ఇప్ప‌టికే చాలా మంది మృతి చెందారు. దీంతో శంక‌ర్ వెన‌క‌డుగు వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: