టాలీవుడ్ లో నందమూరి సోదరులు అయిన యంగ్‌ టైగర్ ఎన్టీఆర్ - కళ్యాణ్ రామ్ మధ్య ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నాలుగైదేళ్ల క్రితం వరకు ఈ ఇద్దరు సోదరుల మధ్య అంతంత మాత్రంగానే ఉన్న అనుబంధం కాస్త వీరి మరో సోదరుడు నందమూరి జానకిరామ్ హఠాన్మరణం తర్వాత వీరిని మ‌రింత దగ్గర చేసింది. ఆ తర్వాత వీరి తండ్రి దివంగత నేత హరికృష్ణ కూడా రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఇప్పుడు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఒకరికి ఒకరు అన్నంత అనుబంధంతో మ‌రింత ద‌గ్గ‌ర‌య్యారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ ఏమాత్రం రెమ్యున‌రేష‌న్‌ తీసుకోకుండా అన్న కళ్యాణ్ రామ్ బ్యాన‌ర్లో జై లవకుశ సినిమా చేసి అన్న అప్పులు మొత్తం తీర్చేశాడు.



ఇక ఇప్పుడు ఇదే ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యార‌లో మ‌రో సినిమా చేసేందుకు ఎన్డీఆర్ రెడీ అవుతున్నాడంటున్నారు. అయితే ఇక్క‌డే ట్విస్ట్ కూడా ఉంది. ఈ సినిమా ద‌ర్శ‌కుడి విష‌యంలోనే  నందమూరి బ్రదర్స్ కళ్యాణ్ రామ్- ఎన్టీఆర్ మధ్య గొడవలు అంటూ ప్రచారమవుతోంది. ఈ ఇద్ద‌రు సోద‌రుల మ‌ధ్య ఓ డైరెక్టర్ గొడవ పెట్టాడంటూ ఒకటే ప్రచారం వేడెక్కిస్తోంది. ఈ ఇద్ద‌రు సోద‌రుల మ‌ధ్యే గొడ‌వ పెట్టిన ఆ ద‌ర్శ‌కుడు ఎవ‌ర‌నుకుంటున్నారా ?  మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాసే న‌ట‌.



ఎన్టీఆర్ 30వ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌లో నిర్మించేందుకు కళ్యాణ్ రామ్ ప్లాన్ చేస్తున్నాడు. అయితే త్రివిక్రమ్ తన కథ వినిపించి ఇప్ప‌టికే ఎన్టీఆర్‌ను లాక్ చేశాడ‌ట‌.  త్రివిక్రమ్ తో సినిమా అంటే హారిక అండ్ హాసిని క్రియేషన్స్ లో మాత్రమే ఉంటుంది. క‌ళ్యాణ్‌రామ్ మాత్రం త్రివిక్ర‌మ్ చేసే సినిమాను త‌న బ్యాన‌ర్‌లో మాత్ర‌మే చేయాల‌ని.. జై ల‌వ‌కుశ సినిమాను మించి ఈ సినిమా ఉండాల‌ని ప‌ట్టుద‌ల‌తో ఉన్నాడ‌ట‌. అయితే ఈ విష‌యంలో ఎన్టీఆర్ అటు అన్న క‌ళ్యాణ్‌కు ఇటు త్రివిక్ర‌మ్‌కు ఎలా చెప్పాలో తెలియ‌క స‌త‌మ‌త‌మ‌వుతున్నాడ‌ట‌. మ‌రి ఫైన‌ల్‌గా ఈ క్రేజీ ప్రాజెక్టు ఎలా సెట్ అవుతుందో ?  చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: