యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం టాలీవుడ్ దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ తో పాటు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా మరొక హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీంగా, అలానే రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గా నటిస్తున్నారు. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా, వచ్చే ఏడాది జనవరి 8న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

 

గతంలో బాహుబలి రెండు భాగాలతో అత్యద్భుత విజయాలు రాజమౌళి అందుకుని ఉండడంతో పాటు, మరోవైపు అటు మెగా, ఇటు నందమూరి ఫ్యామిలీలకు చెందిన ఈ ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తుండడంతో ఈ సినిమాపై ఆకాశమే హద్దుగా అంచనాలు పెరిగాయి. అయితే ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది మధ్యలో పూర్తి కానుందని, ఆ తరువాత నుండి సినిమాకు సంబంధించి గ్రాఫిక్స్, పోస్ట్ ప్రొడక్షన్, విజువల్ ఎఫెక్ట్స్ వంటివి ప్రారంభం అవుతాయని తెలుస్తోంది. అందుకే ఈ లోపు తమ తదుపరి సినిమాల విషయమై అటు ఎన్టీఆర్, ఇటు చరణ్ ఇద్దరూ కూడా కథలు సిద్ధం చేసుకుంటున్నారు. అయితే గత కొద్దిరోజలుగా ఎన్టీఆర్ తన తదుపరి సినిమాని త్రివిక్రమ్ తో చేస్తారని వార్తలు వస్తున్నాయి. 

 

ఇక ఈ విషయమై నేడు కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారాన్ని బట్టి, ఈ సినిమా అధికారిక ప్రకటన నేటి సాయంత్రం 5 గంటలకు అఫీషియల్ గా రానున్నట్టు చెప్తున్నారు. అయినను పోయి రావలె హస్తినకు అనే టైటిల్ లో రూపొందే ఈ సినిమాని హారిక హాసిని సంస్థ నిర్మించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ కోసం రెండేళ్ల గ్యాప్ తీసుకున్న ఎన్టీఆర్, వెనువెంటనే ఈ విధంగా తన తదుపరి సినిమా ప్రకటించడం నిజంగా ఆయన ఫ్యాన్స్ కు మంచి బూస్ట్ ఇచ్చే న్యూస్ అని చెప్పకతప్పదు.....!!   

మరింత సమాచారం తెలుసుకోండి: