టాలీవుడ్ ఇండస్ట్రీలో తన యాక్టింగ్ తో, డ్యాన్సింగ్ టాలెంట్ తో, సింగింగ్ తో గుర్తింపు తెచ్చుకున్న నటుడు జూనియర్ ఎన్టీయార్. ఇప్పటికే తన సినిమాల్లో, ఇతర హీరోల సినిమాల్లో పాటలు పాడిన జూనియర్ ఎన్టీయార్ మరోసారి తన గొంతును సవరించుకోబోతున్నాడు. ఇప్పటివరకూ ఆరు పాటలు పాడిన జూనియర్ ఎన్టీయార్ తమిళంలో విజయ్ కథానాయకుడుగా తెరకెక్కుతున్న మాస్టర్ సినిమాలో ఒక పాట పాడబోతున్నాడని తెలుస్తోంది. 
 
ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాలో "లెట్ మీ సింగ్ ఎ కుట్టీస్టోరీ" అనే పాట ఉంది. గతంలో అనిరుధ్ సంగీతం అందించిన వై దిస్ కొలవెరి ఢీ పాట తరహాలో ఈ పాట కూడా సాగుతుంది. తమిళంలో ఈ పాటను విజయ్ పాడగా అక్కడ ఈ పాట బ్లాక్ బస్టర్ హిట్టైంది. ఈ సినిమాను తెలుగులో కూడా విడుదల చేస్తూ ఉండటంతో మాస్టర్ సినిమా హీరో విజయ్, మాస్టర్ సినిమా దర్శకుడు జూనియర్ ఎన్టీయార్ ను కలిసి లెట్ మీ సింగ్ ఎ కుట్టీస్టోరీ పాటను తెలుగులో పాడమని కోరారు. 
 
ఎన్టీయార్ ఆలోచించుకొని తన నిర్ణయం చెబుతానని తనకు కొంత సమయం కావాలని విజయ్ కు, దర్శకునికి చెప్పినట్టు తెలుస్తోంది. ఎన్టీయార్ అంగీకరిస్తే మాత్రం ఎన్టీయార్ నోటి నుండి మరోపాట వినటానికి ఎంతో సమయం పట్టదు. గతంలో జూనియర్ ఎన్టీయార్ యమదొంగ సినిమాలో ఓలమ్మి తిక్క రేగిందా అనే రీమిక్స్ పాట పాడారు. ఆ తరువాత కంత్రి సినిమాలో 123 నేనొక కంత్రి అనే పాట పాడారు. ఎన్టీయార్ పాడిన ప్రతి పాట సూపర్ హిట్ కావడంతో దర్శకనిర్మాతలు ఎన్టీయార్ తో మరిన్ని పాటలు పాడించారు. 
 
అదుర్స్ సినిమాలో వేర్ ఈజ్ ద పంచకట్టు పాట పాడిన జూనియర్ ఆ తరువాత రభస సినిమాలో రాకాసి రాకాసి పాట, నాన్నకు ప్రేమతో సినిమాలో ఐ వానా ఫాలో ఫాలో పాట పాడారు. కన్నడంలో పునీత్ రాజ్ కుమార్ నటించిన చక్రవ్యూహ సినిమాలో గెలయ గెలయ అనే మరో పాట పాడారు. మరోసారి జూనియర్ ఎన్టీయార్ మాస్టర్ సినిమాతో తన గొంతు సవరించుకొని పాట పాడబోతున్నట్టు వార్తలు వస్తూ ఉండటంపై ఎన్టీయార్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 
 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: