టాలీవుడ్ లో నెంబర్ వన్ రేస్ లో ఉన్న హీరోలు అల్లు అర్జున్, మహేష్ బాబు.  మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన అల్లు అర్జున్ ‘నా పేరు సూర్య’ డిజాస్టర్ తర్వాత రెండేళ్లు గ్యాప్ తీసుకొని ఈ ఏడాది మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో సంక్రాంతి కానుకగా అల వైకుంఠపురములో మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.  ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది.  రెండేళ్ల కసి ఈ మూవీతో తీర్చుకున్నాడు బన్నీ.  ఓవర్సీస్ లో కూడా ఈ మూవీ దుమ్మురేపింది.  ఇన్ నాన్ బాహుబలి రికార్డులు కూడా కైవసం చేసుకుంది.  ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ఓ మూవీలో నటిస్తున్నాడు అల్లు అర్జున్. 

 

ఇక వరుస విజయాలతో దూసుకు పోతున్న సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ఏడాది సంక్రాంతి కానుకగా అనీల్ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నీకెవ్వరు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.  ఈ మూవీ మహేష్ బాబు కెరీర్ లో ది బెస్ట్ మూవీగా నిలిచింది.  కలెక్షన్ల సునామీ సృష్టించింది.  అయితే ఈ ఇద్దరు హీరోలు తమ తదుపరి సినిమాలకు రెడీ అయ్యారు.  కానీ మహేష్ ఫ్యామిలీ తో కలిసి అమెరికా ట్రిప్ లో ఉండగా, అల్లు అర్జున్ కూడా కుటుంబంతో కలిసి వరల్డ్ టూర్ ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తుంది.  తన సినిమా కంప్లీట్ అయ్యాక తన ఫ్యామిలీతో విదేశాలకు వెళ్లడం సాంప్రదాయంగా పెట్టుకున్నారు మహేష్ బాబు. 

 

ఇదే బాటలో అల్లు అర్జున్ సైతం ఫ్యామిలీతో విదేశాలకు వెళ్తూ మంచి ఎంజాయ్ చేస్తున్నారు.  అయితే ఈ ఇద్దరు హీరోలు ఈ సంవత్సరం తమ సినిమాల ప్రమోషన్లతో బిజీ అయ్యారు.  ఇంటర్వూస్, వేదికలు, ప్రసంగాలు, టూర్స్ తో విసిగిపోయిన వీరు సేదతీరడం కోసం కుటుంబాలతో కలిసి వెకేషన్ కి వెళ్లారు. ఈ ఇద్దరు హీరోల కోసం ఇద్దరు దర్శకులు ఎదురు చుస్తున్నారు. బన్నీ టూర్ నుండి తిరిగివచ్చిన వెంటనే సుకుమార్ మూవీ షూటింగ్ పాల్గొనబోతున్నట్లు టాక్.  ఇక మహేష్ బాబు తన తదుపరి సినిమా వంశిపైడిపల్లితో చేస్తున్నట్లు ఫిలిమ్ వర్గాల్లో టాక్ నడుస్తుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: