యంగ్ హీరో నితిన్ దాదాపు ఏడాది విరామం తరువాత చేస్తున్న సినిమా భీష్మ. ఛలో ఫేం వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సూర్య దేవర నాగ వంశీ నిర్మిస్తున్నారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫిబ్రవరి 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నితిన్ సోషల్ మీడియాలోనూ యాక్టివ్గా ఉంటున్నాడు.
తాజాగా ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు ఆసక్తికర సమాధానం ఇచ్చాడు నితిన్. నితిన్ పబ్లిక్ ఫంక్షన్స్కు వచ్చినప్పుడు గోళ్లు కొరుకుతూ కనిపించిన సందర్భాలు చాలా ఉన్నాయి. అయితే వేదిక మీద నితిన్ గోళ్లు కొరుకుతున్న ఫోటోను తన ట్విటర్ పేజ్లో పోస్ట్ చేసిన భాను ప్రకాష్ అనే అభిమాని `ప్రతీసారి మాట్లాడేటపుడు గోళ్లు కొరుకుతావ్ ఏంటీ బ్రో` అంటూ ట్వీట్ చేశాడు. ఈ పోస్ట్పై స్పందించిన నితిన్ `ఒత్తిడి వల్ల బ్రో` అంటూ రిప్లై ఇచ్చాడు.
ఇక నితిన్ విషయానికి వస్తే ఇప్పటికే భీష్మ సినిమా పనులు పూర్తి చేసిన నితిన్, ప్యారలల్గా రంగ్దే సినిమాలోనూ నటిస్తున్నాడు. ఈ సినిమా తరువాత చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఇక ఈ ఏడాదిలో నితిన్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. వచ్చే ఏప్రిల్ 15, 16 తేదిల్లో నితిన్, షాలినిని వివాహం చేసుకోబోతున్నాడు. ఈ మధ్యే పెళ్లి పనులను లాంచనంగా ప్రారంభించారు. పెళ్లి వేడుకను మాత్రం డెస్టినేషన్ వెడ్డింగ్ తరహాలో దుబాయ్లో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి బందువులుతో పాటు అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరు కానున్నారు.
Stress tho bro 🙈😂
— nithiin (@actor_nithiin) February 19, 2020