టాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ స్టార్ హీరోయిన్ గా రష్మిక మందన వెలిగిపోతుంది. వరుసపెట్టి ప్రాజెక్టులు అది కూడా స్టార్ హీరోల పక్కన నటిస్తూ అద్భుతమైన ఆఫర్లు దక్కించుకుంటుంది. ఇటీవలే సూపర్ స్టార్ మహేష్ బాబు అనిల్ రావిపూడి దర్శకత్వం లో నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమా లో ఛాన్స్ దక్కించుకుని సంక్రాంతికి బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత వెంటనే ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ సుకుమార్ మరియు అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో కూడా హీరోయిన్ ఛాన్స్ దక్కించుకుంది.

 

ఇండస్ట్రీలో స్టార్ ప్రాజెక్టుల్లో హీరోయిన్ గా చేస్తూ అవకాశాలు దక్కించుకుంటున్న రష్మిక ఇటీవల ఆమె చేసిన పనికి అందరికీ అసహ్యాన్ని కలిగించింది. అంతేకాకుండా సోషల్ మీడియాలో ఆమె చేసిన పనికి నెటిజన్లు ఆమె అభిమానులు ఫుల్ రేంజ్ లో ఫైర్ అయ్యారు. మేటర్ లోకి వెళ్తే ఇండస్ట్రీలోనే భారీ భారీ అవకాశాలు అందుకుంటున్న రష్మిక ఇటీవల భీష్మ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆమె ఇచ్చిన స్పీచ్ కి అందరూ ఆశ్చర్యపోయారు.

 

సాధారణంగా సినిమాల్లో హీరోయిన్లు సినిమా వేడుకలలో ఒక నాలుగు నిమిషాల్లో రెండు నిమిషాల్లో మాట్లాడతారు. కానీ రష్మిక ఏకంగా 20 నిమిషాల పాటు సుదీర్ఘ ప్రసంగం చేయటంతో మధ్యలో యాంకర్ సుమ వచ్చి కలుగజేసుకున గాని మైక్ ఇవ్వకపోవటంతో ఆడియన్స్ రష్మిక స్పీచ్ ని ఆపాలని కోరారు. ఇంతకీ రష్మిక 20 నిమిషాలు మాట్లాడింది ఏమంటే...తనకి ఛాన్స్ ఇమ్మంటూ త్రివిక్రమ్ ని, దిల్ రాజుని ఆమె స్టేజ్ మీదనుంచే బతిమాలడం తో అందరూ ఒక్కసారిగా షాక్ అవ్వడంతో పాటు ఆమె ఇచ్చిన స్పీచ్ కి కొంత అసహనానికి గురి అయ్యారు.

 

ఒకపక్క వరుస సినిమాలు చేస్తూ మరో పక్క స్టార్ ప్రాజెక్టుల్లో హీరోయిన్ ఛాన్సులు దక్కించుకుని స్టేజీల పైన ఈ విధంగా అడుక్కోవటం అసహ్యంగా ఉంది ఆల్రెడీ నువ్వు స్టార్ హీరోయిన్ నీకు అర్థం అవుతుందా అంటూ సోషల్ మీడియాలో రష్మిక ఇచ్చిన స్పీచ్ కి అభిమానులు సీరియస్ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: