ప్రస్తుతం తెలుగు హీరోయిన్ లలో  యూత్ లో ఎక్కువగా ఆకర్షిస్తున్న  హీరోయిన్లలో ఒకరు నభ నటేష్ . ఈ మధ్యకాలంలో తెలుగు తెరకు పరిచయమై ఎంతగానో అభిమానులను సంపాదించుకున్న ఈ అమ్మడు. ఎనర్జిటిక్ స్టార్ రామ్... పూరి జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ సినిమాలో ... రామ్ గర్ల్ ఫ్రెండ్ పాత్రలో నటించింది నభా నటేష్. మొదటి సినిమాలోనే తెలంగాణ యాసతో అద్భుతంగా డైలాగ్ లు చెప్పి.. ఎంతో మందిని ఆకర్షించింది.దీంతో  యూత్ మొత్తం ఒక్కసారిగా నభ నటేష్  వైపు చూశారు. అందాల ఆరబోతలో కూడా ఎక్కడ తక్కువ కాదు అని నిరూపించింది. హాట్ హాట్ అందాలను ఆరబోస్తూ కుర్రకారుకి చెమటలు పట్టిస్తుంది ఈ అమ్మడు. 

 

 అయితే ఈ అమ్మడు మొదటి మూవీ స్మార్ట్ శంకర్ సంచలన విజయాన్ని నమోదు చేయడంతో ఈ అమ్మడుకి వరుస  అవకాశాలు వచ్చిపడ్డాయి. ఇక ప్రతి షాపింగ్ మాల్ కి బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయింది నభ నటేష్ . దీంతో ఒక్క సినిమాతోనే ఎంతో క్రేజ్ సంపాదించి అటు వెండితెరపై ఇటు షాపింగ్ మాల్ ద్వారా కూడా రెండు చేతులా సంపాదిస్తున్నారు. ఇక  ఇస్మార్ట్ శంకర్ తర్వాత మాస్ మహారాజా డిస్కోరాజా సినిమాలో  నటించినప్పటికీ ఫలితం నిరాశపరిచింది. ఇక త్వరలో మెగా హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన సోలో బ్రతుకే సో బెటరూ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

 

 అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో హాజరైన నభ నటేష్  పారితోషికం కు సంబంధించి ప్రస్తావన రావడంతో తనదైన శైలిలో స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.  సోలో బ్రతుకే సో బెటరూ సినిమాకి నేను పారితోషికం పెంచేసిట్లుగా  నిర్మాతలను గట్టిగానే డిమాండ్ చేసినట్లుగా వార్తలు వచ్చాయి. ఇందులో ఏ మాత్రం నిజం లేదు అంటూ చెప్పుకొచ్చింది. నాకు ఉన్న క్రేజ్ కి పారితోషకం ఎంత తీసుకోవాలో నాకు తెలుసు ఎంత ఇవ్వాలి అనేది నిర్మాతలకు తెలుసు... ఇప్పుడిప్పుడే  ఇండస్ట్రీలో నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తున్నాను... పారితోషికాన్ని డిమాండ్ చేసే స్థాయికి ఇంకా నేను రాలేదు. పారితోషికం ఎక్కువ అడిగి నిర్మాతలను ఇబ్బంది పెట్టను తక్కువ ఇస్తానంటే మాత్రం ఊరుకోను అంటూ చెప్పింది ఈ అమ్మడు.

మరింత సమాచారం తెలుసుకోండి: