బాలీవుడ్ లో సినిమాలు చెయ్యాలి అని ప్రతీ నిర్మాతకు ఉంటుంది. తెలుగులో నాలుగు సినిమాలు చేసినా బాలీవుడ్ లో ఒక సినిమా చేసినా ఒకటే. అక్కడ సినిమాలు చేసి అవి హిట్ అయితే వచ్చే పేరు అంతా ఇంతా కాదు. ఇక డబ్బు గురించి ఎంత చెప్పినా తక్కువే. కోట్లకు కోట్లు డబ్బు... ముఖ్యంగా నిర్మాతలు అయితే బాలీవుడ్ లో ఒక సినిమా చేస్తే చాలు అనుకునే పరిస్థితి ఉంది. అందుకే చాలా మది నిర్మాతలు బాలీవుడ్ పరిచయాల కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. టాలీవుడ్ నిర్మాతలు కూడా ఇప్పుడు అటు వైపు చూస్తున్నారు.

 

సినిమా వసూళ్లు 200 కోట్లకు పైగా వస్తున్నాయి. దీనితో అక్కడి స్టార్ హీరోలతో సినిమా చేయడానికి ఇక్కడి నిర్మాతలు ఎక్కువగా పోటీ పడుతున్నారు. ప్రస్తుతం తెలుగులో భారి సినిమాలు చేస్తుంది మైత్రీ మూవీ మేకర్స్. మహేష్ బాబుతో శ్రీమంతుడు సినిమా చేసి బిగ్ హిట్ కొట్టింది. ఆ తర్వాత కొరటాల శివ తో జనతా గ్యారేజ్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ఒక సినిమా చేసింది. ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయింది. అలాగే సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరో గా రంగస్థలం చేసింది. 

 

ఈ మూడు సినిమాలు కూడా సూపర్ హిట్. ఇప్పుడు మరిన్ని సినిమాలు చేస్తుంది ఈ నిర్మాణ సంస్థ. ఈ నేపధ్యంలోనే త్వరలో బాలీవుడ్ లో అడుగు పెట్టే విధంగా ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. బాలీవుడ్ లో కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా ఒక సినిమా చెయ్యాలని చూస్తుంది. సల్మాన్‌కి ద‌గ్గ‌రి బంధువైన అతుల్ అగ్నిహోత్రితో క‌లిసి బాలీవుడ్ లో సినిమా చేయడానికి ప్రయత్నాలు చేస్తుంది. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథతో ఒక సినిమా చెయ్యడానికి రెడీ అయింది. త్వరలోనే ఈ సినిమా పట్టాలు ఎక్కే అవకాశం ఉందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: