బాలీవుడ్‌ ఇండస్ట్రీలో స్టైల్‌ ఐకాన్‌గా పేరు తెచ్చుకున్న అందాల భామ సోనమ్ కపూర్. స్టార్ హీరో అనిల్‌ కపూర్‌ వారసురాలిగా సిల్వర్ స్క్రీన్‌ ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. అయితే సినిమాల పరిస్థితి ఎలా ఉన్నా.. సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటుంది ఆ బ్యూటీ. తాజాగా ఈ భామ తన పెళ్లి సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ విషయాన్ని బయటపెట్టింది. ప్రముఖ వ్యాపార వేత్త ఆనంద్‌ అహూజా ప్రేమించి పెద్దలను ఒప్పించి వివాహం చేసుకుంది సోనమ్‌. అయితే ఆ పెళ్లి ఆనంద్ అహుజా బరాత్‌ వద్దని చెప్పాడట. అలా ఎందుకు చెప్పాడో కూడా కారణం చెప్పింది సోనమ్‌.

 

పెటా ఇండియా.. సాంప్రదాయ వివాహాల్లో బరాత్‌లో భాగంగా గుర్రాలను వినియోగించటం వల్ల అవి ఎంత ఇబ్బంది పడుతున్నాయి, శారీరకంగా అవి ఎంత బాధపడుతున్నాయో తెలియజేస్తూ ఓ వీడియోను సోనమ్‌కు ట్యాగ్ చేస్తూ షేర్ చేశారు. అయితే వీడియోపై స్పందించిన సోనమ్‌ ` ఈ కారణాలతోనే.. నా భర్త పెళ్లిలో గుర్రాలు, పెద్ద శబ్దాలతో బరాత్ చేయలేదు` అంటూ రిప్లై ఇచ్చింది. ఆ వీడియోలో పెళ్లి అనేది ఓ ఆనందకరమైన సమయం అలాంటి సమయంలో గుర్రాలను భారీ క్యారియేజ్‌లకు కడతారు. వాటి కారణంగా గుర్రాల శరీరాలు తీవ్రంగా గాయపడతయని వివరించారు.

 

సోనమ్‌, ఆనంద్‌లు 2018 మే 8న సాంప్రదాయ బద్ధంగా వివాహం చేసుకున్నారు. అదే రోజు సాయంత్రం ఏర్పాటు చేసిన రిసెప్షన్‌ బాలీవుడ్ తారలోకం అంత సందడి చేసింది. గతంలోనూ సోనమ్‌ జంతువుల సంరక్షణ పట్ల ఇలాగే స్పందించింది. భారీ వర్షాల్లో ఓ బిల్డింగ్‌లో తల దాచుకున్న ఓ కుక్కను ఓ వ్యక్తి దారుణంగా కొట్టిన వీడియోను తన సోషల్‌ మీడియాలో పోస్ట్ చేసి ఆ వ్యక్తి మీద చర్యలు తీసుకోవాలని కోరింది. ఇటీవల జోయా ఫ్యాక్టర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సోనమ్ కపూర్ ప్రస్తుతం మరికొన్ని బాలీవుడ్‌ సినిమాలతో బిజీగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: