దశాబ్దాలుగా తన స్టైల్ ఆఫ్ యాక్షన్ తో తమిళ ప్రేక్షకుల్ని మెప్పిస్తున్న స్టార్ రజినీకాంత్. సినిమాలతో పాటు ఆయన చేసే ఏ కార్యక్రమమైనా సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ధ్యానం కోసం హిమాలయాలకు వెళ్లినా అదో సెన్షేషన్ న్యూస్ అవుతుంది. అటువంటిది రజినీ ఓ వైల్డ్ లైఫ్ టూర్ కు వెళ్లారంటే ఇక అభిమానుల ఆనందానికి అడ్డు ఉంటుందా. ప్రస్తుతం అదే జరిగింది. డిస్కవరీ చానెల్ రూపొందిస్తున్న ‘మ్యాన్ వర్సెస్ వైల్డ్’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ కార్యక్రమం గురించి డిస్కవరీ చానెల్ ఓ మోషన్ పోస్టర్ రిలీజ్ చేసింది.

 

 

ప్రస్తుతం నెట్టింట్లో సెన్షేషన్ క్రియేట్ చేస్తున్న ఈ పదిహేను సెకన్ల మోషన్ వీడియోను బేర్ గిల్స్ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేశాడు. ఇతడే గత ఏడాది దేశ్ ప్రధాని మోదీతో కలిసి షూట్ చేసిన మ్యాన్ వర్సెస్ వైల్డ్ కార్యక్రమం ఎంత సంచలనం రేపిందో తెలిసిందే. ఇదే కార్యక్రమాన్ని ఇప్పుడు సూపర్ స్టార్ తోనూ మూడు రోజులపాటు చేసింది. మోదీతో ఉత్తరప్రదేశ్ లోని అడువులను ఎంచుకోగా.. ఈసారి కర్ణాటకలోని దట్టమైన బందీపూర్ ఫారెస్ట్ రిజర్వ్ లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. త్వరలో ఈ వీడియో రిలీజ్ కానుంది.

 

 

దీనిపై బేర్ గిల్స్.. ‘ఇప్పటివరకూ ఎంతోమంది స్టార్స్ తో ఈ కార్యక్రమం చేశాను కానీ.. వారిలో రజినీ తనకెంతో బెస్ట్. లవ్ ఇండియా. రజినీ లాంటి ఉత్సాహవంతుడితో పనిచేసిన జ్ఞాపకాలు నాకు పదిలం’ అంటూ తన అభిప్రాయాన్ని రాసుకున్నాడు. ఈ వీడియో రజినీతో పోటీ పడి గిల్స్ కూడా మంచి స్టిల్స్ ఇచ్చారు. ఈ షూటింగ్ మొదటిరోజున రజినీకి స్వల్ప గాయాలైన సంగతి కూడా తెలిసిందే. తనకెలాంటి పెద్ద గాయాలు కాలేదని రజినీ చెప్పడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: