టాలీవుడ్ లో త్రివిక్రమ్ రేంజ్ వేరు. వరుసగా రెండు ఫ్లాపులు వచ్చినా సరే ఆయనతో సినిమాలు చేయడానికి నిర్మాతలు, హీరోలు ఎంతగానో పోటీ పడుతూ ఉంటారు. సినిమా హిట్ అయిన ఫ్లాప్ అయినా సరే లాభాలు వస్తూ ఉంటాయని భావిస్తారు. అయితే త్రివిక్రమ్ ఎక్కువగా హారిక అండ్ హాసిని బ్యానర్ లో మాత్రమే సినిమాలు చేయడం మనం చూస్తున్నాం. ఎప్పటి నుంచో ఆయన అదే బ్యానర్ లో సినిమాలు చేస్తున్నారు. ఏ హీరోతో సినిమా చేసినా సరే నిర్మాత రాదా కృష్ణ మినహా ఎవరూ మారడం లేదు అనే విషయం తెలుసు. 

 

ఇదిలా ఉంటే ఇప్పుడు త్రివిక్రమ్ బాలీవుడ్ వైపు చూస్తున్నట్టు సమాచారం. అల వైకుంఠపురం సినిమాను బాలీవుడ్ లో నిర్మించాలని భావిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా హక్కుల కోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నారు కొందరు అక్కడి నిర్మాతలు. ఈ నేపధ్యంలోనే ఒక నిర్మాణ సంస్థ దాదాపు 8 కోట్ల వరకు ఇవ్వడానికి ముందుకి వచ్చింది. దీనితో ఇప్పుడు చిత్ర యూనిట్ ఫుల్ జోష్ లో ఉంది. ఈ నేపధ్యంలోనే బాలీవుడ్ లో కూడా ఈ సినిమాను త్రివిక్రమే దర్శకత్వం వహించే అవకాశం ఉందని అంటున్నారు. 

 

ఇందుకోసం ఆయనకు భారీగా చెల్లించడానికి కూడా సదరు నిర్మాణ సంస్థ ముందుకి వచ్చింది అంటున్నారు. అయితే ఈ సినిమాను అక్కడ కూడా అల్లు అరవింద్ ఏ చెయ్యాలని చూస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాను చేయడానికి సల్మాన్ ఖాన్ ఆసక్తి చూపిస్తున్నాడు. ఇప్పటికే అతనితో అల్లు అరవింద్ కూడా మాట్లాడినట్టు వార్తలు వస్తున్నాయి. ఇక ఈ సినిమా కు నిర్మాతగా త్రివిక్రమ్ కూడా ఉండే అవకాశం ఉందని అంటున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమాను విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం. దీనికి సంబంధించి కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నా స్పష్టత మాత్రం రావడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: