హీరోయిన్లు తమ దుస్తుల మీద ఏ స్థాయిలో ఆసక్తి చూపిస్తారో అందరికి తెలిసిందే. వాళ్లకు అందంగా కనపడితేనే, ఫ్యాషన్ గా కనపడితేనే అవకాశాలు వస్తాయి. అందుకే చాలా మంది హీరోయిన్లు ఫ్యాషన్ వైపు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఇందుకోసం ఎలాంటి దుస్తులు వేసుకోవడానికి అయినా ఆసక్తి చూపిస్తారు. దీనితో డిజైనర్లు కూడా హీరోయిన్లను ఆకట్టుకునే విధంగా బట్టలను రూపొందిస్తారు. బాలీవుడ్ లో ఈ సంస్కృతి ఎక్కువగా ఉంటుంది. అక్కడి హీరోయిన్లు ఫంక్షన్లకు వెళ్ళే సమయంలో కాస్త వింతగా వేసుకుంటారు బట్టలు. 

 

అందులో ప్రముఖ హీరోయిన్లు ముందు వరుసలో ఉంటారు. ప్రియాంకా చోప్రా, దీపిక పదుకొనే, సోనం కపూర్ వంటి హీరోయిన్లు ఎప్పుడూ కాస్త కొత్త గా కనపడే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ జాబితాలోకి ఒక యువ హీరోయిన్ కూడా చేరింది. కెమెరా కళ్ళు అన్నీ కూడా తన మీద పడాలని భావించిన హీరోయిన్ కాస్త వింతగా డ్రెస్ వేసింది. ఏదైనా అవార్డ్ ఫంక్షన్ ఉంటే చాలు అందరిని ఆకట్టుకునే ప్రయత్నం చేసింది ఆ హీరోయిన్. ఒక అవార్డ్స్ ఫంక్షన్ కోసం కొత్తగా డ్రెస్ వేసి అందరిని ఆకట్టుకుంది. 

 

తాజాగా జరిగిన ఫిలిం ఫేర్ ఫంక్షన్ లో బాలీవుడ్ కుర్ర హీరోయిన్ ఊర్వశి రౌతాల ధ‌రించిన డ్రెస్ ప్ర‌త్యేక ఆ కార్యక్రమంలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది. ఎర్ర గులాబీల‌ను పోలిన‌ట్లు ఉన్న ఈ డ్రెస్‌ను త‌యారు చేయ‌డానికి టైలర్లు కాస్త ఎక్కువగానే కష్టపడ్డారు. ఇందుకోసం ఏకంగా 730 గంట‌లు పట్టడం విశేషం. అంతే కాదు ఆ డ్రెస్ వేసుకోవడం కూడా చాలా కష్టమే అని ఆమెను చూస్తే స్పష్టంగా అర్ధమవుతుంది. ఆమె ఈ కార్యక్రమాని వ‌చ్చి కూర్చున్న‌ప్పుడు ఆమె న‌లుగురు ఆసిస్టెంట్స్ వ‌చ్చి ఆ డ్రెస్‌ను సరి చేయడం చూసి అక్కడ ఉన్న వారు ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: