ఈ మద్య క్రేమ్, హర్రర్, కామెడీ నేపథ్యంలో వస్తున్న చిత్రాలకు మంచి ఆదరణ పెరిగిపోయింది. కంటెంటె బాగుంటే ఇలాంటి చిత్రాలకు ఎలాంటి ఢోకా ఉండదని పలుమార్లు రుజువైంది. చిన్న చిత్రాలైనా మంచి కలెక్షన్లు సాధించాయి. తాజాగా సస్పెన్స్ థ్రిల్లర్ గా 'వలయం' చిత్రం రూపొందింది. కొంతకాలం క్రితం 'నీతో వస్తా' చిత్రంతో తెలుగు తెరకి హీరోగా పరిచయమైన లక్ష్ తాజాగా ‘వలయం’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. సమాజంలోని ఓ అంశాన్ని తీసుకుని కొత్త తరహా ప్రేమ కథా చిత్రంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. మరో నాలుగు రోజుల్లో ఈ చిత్రం రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాల్లో జోరు పెంచారు.
ఇక ఇప్పటికే ఈ చిత్రం నుండి టీజర్, ట్రైలర్ లను రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. రమేష్ కుడుముల దర్శకత్వంలో లక్ష్, దిగంగన సూర్యవంశీ హీరో హీరోయిన్లు గా తెరకెక్కుతున్న సస్పెన్స్ థ్రిల్లర్ ‘వలయం’. ఈ మద్య కాలంలో అమ్మాయిలపై జరుగుతున్న అకృత్యాల నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతుందని చిత్ర యూనిట్ తెలిపారు. ఇక కథ విషయానికి వస్తే.. హీరో భార్య కనపడకుండా పోతుంది. ఆమెకు ఉన్న లవ్ ఎఫైర్ కారణంగా హీరోనే చేంపేశాడని పోలీసులు అనుమానిస్తుంటారు. ఉన్న ఆధారాల ఆధారంగా హీరో ఆమెను ఎలా కనుగొన్నాడనేదే కథాంశం అని టీజర్, ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది.
అసలు సీక్రెట్ తెలియాలంటే సినిమా విడుదల వరకు ఆగాల్సిందే. ఈ చిత్రం 21వ తేదీన విడుదల కానుంది. తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డువారు ఈ చిత్రానికి కి U/A సర్టిఫికెట్ ను మంజూరు చేశారు. శేఖర్ చంద్ర అందించిన సంగీతం ఈ చిత్రానికి మంచి ప్లస్ పాయింట్ అవుతుందని అంటున్నారు. మరి ఈ చిత్రం ఏ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి మరి.