టాలీవుడ్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సినిమా చెయ్యాలని ఏ నిర్మాతకు మాత్రం ఉండదు చెప్పండి. తారక్ తో సినిమా అనగానే చాలా మంది దర్శకులతో పాటు నిర్మాతలు కూడా వెంటనే ఓకే చెప్పేస్తారు. అయితే కళ్యాణ్ రామ్ విషయంలో మాత్రం సినిమా ఓకే అయినట్టే అయి చేజారిపోయింది. వాస్తవానికి జై లవకుశ సినిమా తర్వాత తన తమ్ముడితో సినిమా చెయ్యడానికి కళ్యాణ్ రామ్ ప్లాన్ చేసాడు. దీనికి ఎన్టీఆర్ కూడా ఓకే అనేసాడు. రాజమౌళి తో చేస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాలో తాను షేర్ తీసుకుందాం అనుకున్నాడు. 

 

మరి ఏమైందో ఏమో ముందు మాట ఇచ్చాను అంటూ దానయ్య కు ఓకే చేసాడు రాజామౌళి. ఇక అక్కడి నుంచి తర్వాతి సినిమా కచ్చితంగా తారక్ తన అన్నతోనే చేస్తాడు అనుకున్నారు. ఇక్కడ ఒక చిక్కు వచ్చి పడింది. త్రివిక్రమ్ సినిమాలు అన్నీ కూడా హారిక అండ్ హాసినీ బ్యానర్ లోనే చేస్తాడు. దీనితో రాధాకృష్ణ ను కాదని మరో నిర్మాతతో సినిమా చేసే అవకాశం లేదని భావించారు. కాని ఎలా అయినా సరే తారక్ తో సినిమా వదలకూడదు అని పట్టుదలగా ఉన్న కళ్యాణ్ రామ్ ఈ పట్టుబట్టాడు. 

 

దీనితో త్రివిక్రమ్ రాధాకృష్ణ తో మాట్లాడి షేర్ అన్నాడు. కాని అందుకు కళ్యాణ్ రామ్ నో అన్నాడు. వెంటనే తారక్ కూడా రంగంలోకి దిగేసాడు. అన్నను ఒప్పించాలని భావించి ఎలా అయినా సరే ఈ సినిమాలో అన్నకు షేర్ ఇవ్వడానికి రెడీ అయ్యాడు. ముందు తారక్ 31 వ సినిమా చేస్తా అన్న కళ్యాణ్ రామ్ ఇప్పుడు డ్రాప్ అయి తమ్ముడు ఒప్పించడం తో రాధాకృష్ణ బ్యానర్, హారిక అండ్ హాసిని తో కలిసి తన ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమా అధికారిక ప్రకటన బుధవారం రాగా విడుదల చేసిన పోస్టర్ లో కళ్యాణ్ రామ్ పేరు ఉంది. దీనితో కళ్యాణ్ రామ్ కి లాభాల పంట అంటున్నారు అభిమానులు.

మరింత సమాచారం తెలుసుకోండి: