టెలివిజన్ రంగంలో హాట్ యాంకరింగ్ చేస్తూ చిట్టి పొట్టి బట్టలతో కుర్రకారును పిచ్చెక్కించిన యాంకర్ రేష్మి వైజాగ్ లో వ్యాపార రంగంలోకి అడుగు పెట్టినట్లు ఇండస్ట్రీలో వార్తలు వినబడుతున్నాయి.  'జబర్దస్త్' మరియు 'ఢీ' లాంటి షోలతో ఫుల్ బిజీగా ఉంది రేష్మి. ఒకపక్క బుల్లితెరపై మరోపక్క సినిమా రంగంలో చాలా సక్సెస్ ఫుల్ గా రాణిస్తుంది యాంకర్ రేష్మి. అయితే తన లైఫ్ లో డబ్బు అవసరం అన్నది చాలా ఇంపార్టెంట్ అని చాలా సందర్భాలలో తెలుసుకోవటం జరిగింది కాబట్టి నా జీవితంలో డబ్బు సంపాదించడానికి వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకునే పరిస్థితి లేదని తెలిపింది. కెరియర్ లో వచ్చిన ఏ చిన్న చిన్న రూల్స్ కూడా నటించడం నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని చాలా సందర్భాలలో బహిరంగంగానే ఇంటర్వ్యూలలో రేష్మి చెప్పుకొచ్చింది.

 

ఇటువంటి తరుణంలో ఒక పక్క సినిమా రంగంలో మరో పక్క బుల్లితెరపై విజయవంతం గా రాణిస్తున్న రేష్మి రీసెంట్ గా వ్యాపార రంగంలోకి కూడా అడుగు పెట్టినట్లు సమాచారం. మేటర్ లోకి వెళితే ఇటీవల యాంకర్ రేష్మి వైజాగ్ మరియు ఒరిస్సా బోర్డర్ ప్రాంతాలలో దాదాపు వంద ఎకరాల ల్యాండు కొన్నట్లు ఇండస్ట్రీలో వినబడుతున్న టాక్. యాంకర్ రేష్మి ఆంధ్రా-ఒడిశా బోర్డర్ లో ఉన్న బెర్హాపూర్ ప్రాంతంలో పుట్టారు. ఆమె చదువు మొత్తం వైజాగ్ లో జరిగింది. ఇప్పుడు తన సొంతూరులో భూములు కొని అందులో పంటలు వేయబోతున్నట్లు తెలుస్తోంది.

 

కోకో, యూకలిప్టస్ వంటి పంటలను పండించాలని వ్యాపారం చెయ్యాలని యాంకర్ రేష్మి ఆలోచిస్తున్నట్లు సమాచారం. మరోపక్క వైజాగ్ లో వ్యాపారాలు పెట్టడానికి సినిమా ఇండస్ట్రీ నుండి రామ్ చరణ్ అదే విధంగా మహేష్ బాబు కూడా రంగంలోకి దిగుతున్నట్లు సమాచారం. మహేష్ బాబు ఏమో మల్టీప్లెక్స్ థియేటర్ వ్యాపారంలోకి రావాలని ఆలోచిస్తుండగా రామ్ చరణ్ హోటల్ వ్యాపారం వైజాగ్ లో ప్రారంభించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: