శ్రీను వైట్ల దర్శకత్వంలో ఆకాష్ హీరోగా తెరకెక్కిన ఆనందం సినిమా అప్పట్లో ఎంత మంచి విజయాన్ని సాధించిందో తెలిసిన  విషయమె . ముఖ్యంగా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తూ మంచి విజయాన్ని అందుకుంది. 2001లో విడుదలైన ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ రేఖ వేదవ్యాస్. అయితే అప్పటి వరకు కన్నడ భాషలో ఎన్నో సినిమాలు చేసినప్పటికీ తెలుగులో మాత్రం ఆనందం సినిమా మొదటిది.  అయినప్పటికీ ఎంతో బాగా నటించి ఎన్నో అవకాశాలను చేజిక్కించుకుంది ఈ అమ్మడు. ఇక తన అందం అభినయంతో కూడా ఎంతో మంది ప్రేక్షకులను ఆకర్షించింది. మొదటి సినిమాతోనే మంచి విజయం సాధించడంతో పలు సినిమాల్లో  అవకాశాలు వచ్చి ఈ అమ్మడు చంత వాలాయి. 

 


 ఇక ఆ తర్వాత నందమూరి హీరో అయినా తారకరత్న డెబ్యూ మూవీ  ఒకటో నెంబర్ కుర్రాడు అనే సినిమాలో ఛాన్స్ కొట్టేసింది ఈ అమ్మడు . అయితే ఈ సినిమా మాత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్షకుల ఆదరణ పొందలేకపోయింది. అయితే ఈ సినిమాలోని పాటలు మాత్రం ఇప్పటికీ ఎంతో మంది ప్రేక్షకుల ఆదరణ పొందుతూ ఉంటాయి. ఇక ఈ సినిమా తర్వాత రేఖ వేదవ్యాస్ కు అంతగా అవకాశాలు కూడా రాలేదు. అయితే ఒకవేళ తారకరత్న నటించిన ఒకటో నెంబర్ కుర్రాడు అనే సినిమా హిట్ అయి ఉంటే ఈ హీరోయిన్ కి  మరిన్ని అవకాశాలు పెరగడంతో పాటు మరింత ఇమేజ్ పెరిగేది.  ఇక ఆ తర్వాత మన్మధుడు  లో రేఖ స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చింది. దీంతో నాగార్జునతో కలిసి రెండు మూడు సీన్లలో నటించి ఈ అమ్మడు. 

 

 ఆ తర్వాత తెలుగు తెరపై ఎక్కడా కనిపించలేదు. సరైన అవకాశాలు రాకపోవడంతో తెలుగు తెరపై కనుమరుగైపోయింది రేఖ  వేదవ్యాస్. అయితే ఈ అమ్మడు సినిమాలు చేయనప్పటికీ  ఈ అమ్మడు మాత్రం ఇప్పటికీ తెలుగు ప్రేక్షకుల మదిలో అలాగే నిలిచిపోయింది. అయితే ఈ అమ్మడు తాజాగా ఈటీవీ లో ప్రసారమయ్యే ఆలీతో సరదాగా అనే కార్యక్రమానికి హాజరైంది. ఈ సందర్భంగా తన పర్సనల్ లైఫ్ సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకుంది . ఈ సందర్భంగా ఒకవేళ నువ్వు ముఖ్యమంత్రి అయితే ఏం చేస్తావ్ అని అడిగిన ప్రశ్నకు... ఆసక్తికర సమాధానం చెప్పింది. ఒకవేళ నేను చేయను అయితే పార్కులలో ఏ టైంలో అయినా తిరిగే  సౌకర్యాన్ని కల్పిస్తాను అంటూ చిలిపి నవ్వు నవ్వింది ఈ అమ్మడు.

మరింత సమాచారం తెలుసుకోండి: