ఈ మద్య సినీ పరిశ్రమలో రిమేక్ ల జోరు బాగా పెరిగిపోయింది. ఒక భాషలో హిట్ అయిన సినిమాను మరో భాషలో రిమేక్ చేస్తున్నారు.  బాలీవుడ్ లో గత ఏడాది ఆయుష్మాన్ ఖురానా, రాధికా ఆప్టే, టబు ప్రధానమైన పాతాలు పోషించి తెరకెక్కిన ‘అంధాదున్’ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఈ మూవీలో ఆయుష్మాన్ ఖురానా ఓ అంధుడిగా నటిస్తాడు.  ఓ మర్డర్ మిస్టరీకి సంబంధించిన  ఈ మూవీ మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా వైవిధ్యభరితమైన సినిమాగా ప్రశంసలు కూడా అందుకుంది. తెలుగు నేటివిటీకి అనుగుణంగా స్క్రిప్ట్‌లో కొన్ని మార్పులు చేశామని, ఈ సినిమాకు మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తారని నితిన్‌ తెలిపారు.

 

అలాగే తమిళంలో ఈ మూవీ హీరో ప్రశాంత్ రీమేక్ చేస్తున్నారు. కాగా ఈ మూవీ కోసం ఆయన చాలా వెయిట్ తగ్గారట. జిమ్ లో కఠిన కసరత్తులు చేసి ఆయన ఫిట్ గా తయారయ్యారట.   ఇటివలే ఆయుష్మాన్ కి ఆ సినిమాకు గానూ నేషనల్ అవార్డు వచ్చిందని అది భయం కలిగించిందని అన్నాడు. సమ్మర్ నుండి సినిమా సెట్స్ పైకి వెళ్తుందని తెలిపాడు. ఇక మూడు సినిమాలు ఒకే సారి చేయడం నరకం అంటూ చెప్పుకున్నాడు. ఇకపై ఒకే సారి మూడు సినిమాలు చేయనని తెలిపాడు.

 

అయితే ఆయుష్మాన్ పాత్రకు అవార్డు రావడం తో ఆ పాత్రలో నటించడంపై తాను మరింత శ్రద్ద పెట్టాలని.. తనకు మరింత బాధ్యత పెరిగిందని అంటున్నాడు నితిన్.  ప్రస్తుతం నితిన్ ‘భీష్మ’ ,  ‘రంగ్ దే’ సినిమాలతో బిజీగా ఉన్నాడు. కాగా, ఆ రెండు సినిమాలు తర్వాత నితిన్ చేయబోయే ‘అంధాదున్’  తెరకెక్కించే యోచనలో ఉన్నారు. ఇక తన ప్రేమ పెళ్లి గురించి డీటెయిల్స్ కూడా మీడియాతో పంచుకున్నాడు నితిన్. ఏప్రిల్ 15న ఎంగేజ్ మెంట్ ఏప్రిల్ 16 న దుబాయ్ లో పెళ్లి జరగుందని వచ్చాక ఏప్రిల్ 21న హైదరాబాద్ లో రిసెప్షన్ ఉంటుందని తెలిపాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: