శ్రీనివాస కళ్యాణం తరువాత గత ఏడాది ఒక్క
సినిమా తో కూడా ప్రేక్షకులముందుకు రాలేకపోయిన యంగ్
హీరో నితిన్ ఆగ్యాప్ ను ఈఏడాది కవర్ చేయనున్నాడు. ఈ ఏడాది ఏకంగా నాలుగు సినిమాలతో
నితిన్ తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. అందులో భాగంగా ఎల్లుండి
నితిన్, భీష్మ తో రానున్నాడు.
ఛలో ఫేమ్
వెంకీ కుడుముల తెరకెక్కించిన ఈచిత్రం పై మంచి అంచనాలే వున్నాయి. కమర్షియల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో
రష్మిక మందన్న హీరోయిన్ గా నటించగా
మహతి స్వర సాగర్ సంగీతం అందించాడు.
సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మించింది.
ఇక
నితిన్ ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తున్నాడు. అందులో
తొలిప్రేమ ఫేమ్
వెంకీ అట్లూరి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న రంగ్ దే ఒకటి .. దాదాపు సగానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకుంది ఈ చిత్రం. ఏప్రిల్ లో సినిమాను పూర్తి చేసి ఆగస్టు లో విడుదలచేయనున్నారు. పీసీ
శ్రీరామ్ కెమెరామెన్ గా పనిచేస్తుండగా దేవి శ్రీ
ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.
నితిన్ సరసన
కీర్తి సురేష్ నటిస్తుండగా ఈచిత్రాన్ని కూడా
సితార ఎంటర్ టైన్మెంట్సే నిర్మిస్తుంది. ఈసినిమా తోపాటు
నితిన్ ,చంద్రశేఖర్ యేలేటి డైరెక్షన్ లో
చెక్ అనే
సినిమా లో నటిస్తున్నాడు. ఇటీవలే ఈ
సినిమా మొదటి షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. ఈ చిత్రాన్నిసెప్టెంబర్ లోపు పూర్తి చేసి
అక్టోబర్ లేదా
నవంబర్ లో విడుదలచేయనున్నారు.
ఈసినిమాల తరువాత నితిన్,అంధధూన్ రీమేక్ లో నటించనున్నాడు. వెంకటాద్రి ఎక్ప్ ప్రెస్ ఫేమ్ మేర్లపాక గాంధీ తెరకెక్కించనున్నఈ చిత్రం మే నుండి సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈఏడాది చివర్లో ఈ చిత్రాన్ని విడుదలచేయనున్నారు. ఇవే గాక నితిన్, కృష్ణ చైతన్య డైరెక్షన్ లో పవర్ పేటలో కూడా నటించనున్నాడు. రెండు భాగాలుగా రానున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సెట్స్ మీదకు వెళ్లనుంది.