టాలీవుడ్ లోకి నవీన్ చంద్ర హీరోగా నటించిన ‘అందాల రాక్షసి’ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది లావణ్య త్రిపాఠి.  మొదటి సినిమా పెద్దగా సక్సెస్ కాకున్నా ఈ అమ్మడి అమాయకపు నటనకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఆ తర్వాత ‘భలే భలే మగాడివోయ్', 'సోగ్గాడే చిన్ని నాయనా', 'శ్రీరస్తు శుభమస్తు' సినిమాలు మంచి విజయాలు అందుకున్నాయి.  అయితే ఈ సినిమాలు మంచి హిట్ టాక్ తెచ్చుకున్నప్పటికీ లావణ్యకు మాత్రం పెద్దగా కలిసి రాలేదు.  సినిమాల కోసం వేయిటింగ్ లీస్టు లో ఉంటూ వచ్చింది.  గత ఏడాది నిఖిల్ హీరోగా నటించిన ‘అర్జున్ సురవరం' వంటి సక్సెస్ ఫుల్  మూవీలో నటించినా కూడా పేరు రాలేదు.  సినిమాలు హిట్ అవుతున్నా.. పేరు రాకపోవడంతో నైరాశ్యంలో ఉంటుంది.  కెరీర్ పరంగా కొనసాగుతూనే ఉంది.

 

ప్రస్తుతం లావణ్య త్రిపాఠి తెలుగులో రెండు సినిమాలు చేస్తోంది. అందులో ఒకటి... 'ఏ1 ఎక్స్‌ప్రెస్'.  రెండోది చావు కబురు చల్లగా మూవీలో నటిస్తుంది.  అయితే ఏ1 ఎక్స్‌ప్రెస్' లో హాకీ ప్లేయర్ గా కనిపిస్తుంది లావణ్య త్రిపాఠి. ఆ క్యారెక్టర్ కోసం హాకీ కోర్టులో తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తున్నట్లు చెప్తోంది.  ఆ మద్య జెర్సీ సినిమాలో క్రికెటర్ గా కనిపించిన నాని కొన్ని రోజుల పాటు క్రికెట్ ప్రాక్టీస్ చేసిన విషయం తెలిసిందే.  తెరపై నేచురల్ గా కనిపించేందుకు మంచి  అనుభవం కోసం నటీ, నటులు ఇలా ప్రాక్టీస్ చేస్తున్నారు.

 

తెలుగు సినిమాలతో పాటు ప్రస్తుతం లావణ్యా త్రిపాఠి ఒక తమిళ సినిమా కూడా చేస్తున్నారు. రోజంతా చెన్నైలో తమిళ సినిమా షూటింగ్ చేసి, నైట్ ఫ్లయిట్ క్యాచ్ చేసి హైదరాబాద్ వస్తున్నారు. ఎర్లీ మార్నింగ్ హాకీ  ప్రాక్టీస్ చేస్తున్నారు.  ఇలా ఓ వైపు ప్రాక్టీస్.. మరోవైను యాక్టింగ్ విషయంలో శ్రద్ద చూపిస్తుంది లావణ్య త్రిపాఠి. ఏది ఏమైనా ఈ రెండు సినిమాలతో మంచి సక్సెస్ అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: