పవన్ కళ్యాణ్ సినిమా చేస్తున్నాడు అనగానే ఆయన ఫ్యాన్స్ చేసే హడావుడి అంతా ఇంతా కాదు. ఇక రాజకీయాలతో పాటుగా సినిమాల మీద దృష్టి పెడుతున్న పవన్ కళ్యాణ్ ప్రస్తుతం శ్రీరాం వేణు దర్శకత్వంలో పింక్ సినిమాలో నటిస్తున్నాడు. దీనికి సంబంధించి ఇప్పటి వరకు టైటిల్ ఖరారు కాకపోయినా షూటింగ్ మాత్రం దాదాపుగా పూర్తి అయింది అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. ఈ వేసవిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. విడుదల తేదీ పై ఇంకా స్పష్టత రావడం లేదు. 

 

ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమా పూర్తి కాకుండా పవన్ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. క్రిష్ దర్శకత్వంలో ఒక సినిమాకు ఓకే చెప్పేసాడు. దీనితో ఈ సినిమా తవరలో సెట్స్ పైకి వెళ్ళే అవకాశాలు కనపడుతున్నాయి. పీరియాడికల్ డ్రామా గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి వస్తుంది. ఇప్పటికే సినిమా స్క్రిప్ట్ ని కూడా పూర్తి చేసుకున్న క్రిష్ కొన్ని మార్పులు కథలో ఉంటే చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నట్టు సమాచారం. ఇక ఈ సినిమా షూటింగ్ ని హైదరాబాద్ లో మొదలుపెడుతున్నారు. 

 

పవన్ కళ్యాణ్ కూడా తన కెరీర్‌లో ఫస్ట్ పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ మూవీ కోసం ప్రత్యేకంగా హైదరబాద్‌లో పడవ సెట్‌ను  ఆర్ట్ డైరెక్టర్ పర్యవేక్షణలో సిద్దం చేస్తున్నారు. ఈ పడవలో కీలక సన్నివేశాలను చిత్రీకరించే అవకాశం ఉందని టాక్. ఒక ఫైట్ కూడా ఉంటుంది అంటున్నారు. పాన్ ఇండియా లెవెల్ లో వస్తున్న ఈ సినిమా విషయంలో ఎక్కడా కూడా రాజీ పడకూడదు అనేది దర్శకుడు క్రిష్ ఆలోచన. ఇందుకోసం అవసరమైతే తాను కూడా నిర్మాతగా మారే ఆలోచనలో ఉన్నాడట. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి లేదా ఈ ఏడాది దసరా కు విడుదల చేసే అవకాశం ఉందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: