యంగ్ హీరో నితిన్‌ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం `భీష్మ`. రష్మిక మందన్న హీరోయిన్‌గా న‌టించిన ఈ చిత్రాన్ని దర్శకుడు వెంకీ కుడుముల తెరకెక్కించాడు. రొమాంటిక్ యాక్షన్‌ ఎంటర్‌టైనర్ గా తెర‌కెక్కిన ఈ చిత్రం ఫిబ్రవరి 21న భారీ అంచ‌నాల న‌డుమ‌ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.  సితార ఎంటర్ ట్రైన్మెంట్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రానికి సూర్యదేవర నాగవంశీ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇక నితిన్‌ వరసగా మూడు ప్లాపులు రావ‌డంతో.. ఏడాది పాటు సినిమాలకు దూరంగా ఉన్నాడు. ఈ నేప‌థ్యంలోనే నితిన్ నుండి సినిమా వచ్చి ఏడాదిన్నర కావొస్తోంది. అయితే ఈ గ్యాప్ లో వరసగా సినిమాలను సెట్ చేసుకున్నాడు నితిన్. 

 

ప్ర‌స్తుతం సరైన హిట్ లేక చాలా కాలం కావడంతో భీష్మ మూవీపై భారీ అంచానాలు పెట్టుకున్నాడు. భీష్మ విషయంలో నితిన్ చాలా జాగ్రత్తగా వ్యవహరించాడు. తనతో పాటు సినిమాలో హీరోయిన్ గా చేస్తోన్న రష్మికకు కూడా సమ ప్రాధాన్యం దక్కేలా చూసుకున్నాడు. దీంతో ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. రష్మిక, నితిన్ మధ్య కెమిస్ట్రీ యువతని ఆకర్షించే విధంగా ఉంది. మ‌రియు వ్యవసాయం నేపథ్యంలో రెండు కంపెనీలకు మధ్య కథ సాగుతున్నట్లు ట్రైలర్‌ను చూస్తే అర్థమవుతోంది.

 

ఇక విడుదల‌కు సిద్ధంగా ఉన్న‌ ఈ సినిమా తాలూకా శాటిలైట్ హక్కులను తెలుగు టాప్ ఛానెల్స్ లో ఒకటి అయినటువంటి జెమినీ టీవీ సొంతం చేసుకున్నట్టు తెలుస్తుంది. జస్ట్ ఈ 2020లో వచ్చిన ఒకటి రెండు చిత్రాలు తప్ప అన్ని సినిమాల తాలుకా శాటిలైట్ హక్కులను జెమినీ టీవీ సొంతం చేసేసుకుంది. ఇప్పుడు వాటన్నిటి సరసన ఇప్పుడు ఈ చిత్రం కూడా నిలిచింది. దీంతో ఈ చిత్రాల‌ను ఎప్పుడెప్పుడు టెలికాస్ట్ చేస్తారా అని ప్రేక్ష‌కులు ఆస‌క్తిగా చూస్తున్నారు. మ‌రి ఫిబ్ర‌వ‌రి 21న విడుద‌ల కాబోయే భీష్మ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: